ఇజ్రాయెల్-ఇరాన్ వార్: తక్షణ కాల్పుల విరమణకు యూఏఈ పిలుపు..!!
- June 18, 2025
లండన్: ఇజ్రాయెల్ -ఇరాన్ వార్ పై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ కీలక ప్రకటన చేశారు. కొనసాగుతున్న సంఘర్షణ వల్ల కలిగే ముప్పు గురించి హెచ్చరించారు. తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. "రాజకీయ, దౌత్య పరిష్కారాలకు ప్రత్యామ్నాయం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి , భద్రతా మండలి జోక్యం చేసుకుని పెరుగుతున్న హింసను ఆపాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం వాటి సరిహద్దులను దాటి విస్తరించే అవకాశం ఉందని, ఇది మరింత తీవ్ర నష్టాని దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. "రెండు పార్టీలను ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందేలా, శత్రుత్వాలను అంతం చేయడానికి పరిస్థితి తీవ్రమైన పరిణామాలకు దారితీయకుండా నిరోధించడానికి దౌత్యపరమైన విధానం అత్యవసరం అని యూఏఈ విశ్వసిస్తోంది." అని ఆయన అన్నారు. సంఘర్షణలను ఆపేందుకు అంతర్జాతీయ దౌత్యం అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









