ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 18, 2025
యూఏఈ: ఇతర ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. ఇరాన్ ధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్రిక్తత నివారణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, ప్రాంతీయ సంఘర్షణను తగ్గించడంలో యూఏఈ నిబద్ధతను షేక్ మొహమ్మద్ తెలియజేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్యపరమైన సంప్రదింపులలో యూఏఈ చురుకుగా పాల్గొంటుందని షేక్ మొహమ్మద్ హామీ ఇచ్చారు.తిరిగి ప్రశాంతతను పునరుద్ధరించడానికి.. సంభాషణను ప్రోత్సహించడానికి దోహదపడే ఏవైనా చర్యలకు యూఏఈ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణపై పెరుగుతున్న ఆందోళనల మధ్య దౌత్యం, సంఘర్షణల శాంతియుత పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో యూఏఈ విస్తృత ప్రాంతీయ విధానాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







