ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 18, 2025
యూఏఈ: ఇతర ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. ఇరాన్ ధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్రిక్తత నివారణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, ప్రాంతీయ సంఘర్షణను తగ్గించడంలో యూఏఈ నిబద్ధతను షేక్ మొహమ్మద్ తెలియజేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్యపరమైన సంప్రదింపులలో యూఏఈ చురుకుగా పాల్గొంటుందని షేక్ మొహమ్మద్ హామీ ఇచ్చారు.తిరిగి ప్రశాంతతను పునరుద్ధరించడానికి.. సంభాషణను ప్రోత్సహించడానికి దోహదపడే ఏవైనా చర్యలకు యూఏఈ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణపై పెరుగుతున్న ఆందోళనల మధ్య దౌత్యం, సంఘర్షణల శాంతియుత పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంలో యూఏఈ విస్తృత ప్రాంతీయ విధానాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







