ప్రాంతీయ సంఘర్షణ ఉన్నా..వేసవి సెలవుల ప్రణాళికలతో ముందుకే..!!
- June 18, 2025
యూఏఈ : ప్రాంతీయ సంఘర్షణ పెరుగుతున్నప్పటికీ.. నిర్దిష్ట విమాన మార్గాలను నిలిపివేసినప్పటికీ, యూఏఈలోని చాలా మంది నివాసితులు, పౌరులు ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఈ ప్రాంతంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. సంఘర్షణ కారణంగా యూఏఈ విమానయాన సంస్థలు విమానాల రద్దును పొడిగించారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇరాన్ లకు సర్వీసులను నిలిపివేశాయి. దాంతో కొందరు యూఏఈ నివాసితులు చివరి నిమిషంలో తమ వెకేషన్ గమ్యస్థానాలను మార్చుకున్నారు. మరికొందరు విమాన మార్గాల వల్ల ప్రభావితం కాని దేశాలను ఎంచుకుంటున్నారు.
ప్రతి వేసవిలో ప్రయాణించే దుబాయ్కు చెందిన ఎమిరాటీ హలీమా మోస్సా మాట్లాడుతూ.. తాను తన వేసవి సెలవుల సంప్రదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనన్నారు.. "నేను మక్కా, మదీనాలో ఉమ్రా చేయడానికి జూలై ప్రారంభంలో సౌదీ అరేబియాకు ఐదు రోజుల పర్యటనను బుక్ చేసుకున్నాను" అని తెలిపారు. "ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా దక్షిణాన ఉండటం. సంఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉండటం వలన నేను చాలా సురక్షితంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.
ఈ నెల చివరిలో ఆమె తన కుటుంబంతో టర్కీకి వెళ్లాలని ప్లాన్ చేశారు. "పరిస్థితులు శాంతించిన వెంటనే, నేను వెంటనే ప్రయాణాన్ని బుక్ చేసుకుంటాను." అని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగుపడకపోతే, తాను ఈ సంవత్సరం సౌదీ అరేబియాను సందర్శిస్తాను అని తెలిపారు.
అబుదాబికి చెందిన ఎమిరాటీ అయిన అబ్దుల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తాడు. అతను తన రాబోయే పర్యటన పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, "నేను రేపు ఉదయాన్నే విశ్రాంతి యాత్ర కోసం ఇండోనేషియాకు వెళ్తున్నాను. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం" అని చెప్పాడు. అతను 12 రోజులు ఉండాలనుకుంటున్నాడు. "నేను ఖతార్ ఎయిర్వేస్లో నా విమానాన్ని బుక్ చేసుకున్నాను. ఇండోనేషియాకు వెళ్లే మార్గం సురక్షితంగా ఉంది." అని తెలిపారు.
దుబాయ్కు చెందిన ఎమిరాటీ అయిన అల్ ముహన్నది తన తండ్రి తరపు బంధువులను కలుసుకునేందుకు వేసవి పర్యటనను ప్లాన్ చేస్తున్నాడు. "నేను పరిస్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు. విమానాలు సర్వీసులు నిలిచిపోతే.. నేను రోడ్డు మార్గం ద్వారా తిరిగి రాగలను." అని తెలిపాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా యూఏఈ నివాసితులు జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్లకు తమ వేసవి ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







