ప్రాంతీయ సంఘర్షణ ఉన్నా..వేసవి సెలవుల ప్రణాళికలతో ముందుకే..!!
- June 18, 2025
యూఏఈ : ప్రాంతీయ సంఘర్షణ పెరుగుతున్నప్పటికీ.. నిర్దిష్ట విమాన మార్గాలను నిలిపివేసినప్పటికీ, యూఏఈలోని చాలా మంది నివాసితులు, పౌరులు ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఈ ప్రాంతంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. సంఘర్షణ కారణంగా యూఏఈ విమానయాన సంస్థలు విమానాల రద్దును పొడిగించారు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇరాన్ లకు సర్వీసులను నిలిపివేశాయి. దాంతో కొందరు యూఏఈ నివాసితులు చివరి నిమిషంలో తమ వెకేషన్ గమ్యస్థానాలను మార్చుకున్నారు. మరికొందరు విమాన మార్గాల వల్ల ప్రభావితం కాని దేశాలను ఎంచుకుంటున్నారు.
ప్రతి వేసవిలో ప్రయాణించే దుబాయ్కు చెందిన ఎమిరాటీ హలీమా మోస్సా మాట్లాడుతూ.. తాను తన వేసవి సెలవుల సంప్రదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనన్నారు.. "నేను మక్కా, మదీనాలో ఉమ్రా చేయడానికి జూలై ప్రారంభంలో సౌదీ అరేబియాకు ఐదు రోజుల పర్యటనను బుక్ చేసుకున్నాను" అని తెలిపారు. "ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా దక్షిణాన ఉండటం. సంఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉండటం వలన నేను చాలా సురక్షితంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.
ఈ నెల చివరిలో ఆమె తన కుటుంబంతో టర్కీకి వెళ్లాలని ప్లాన్ చేశారు. "పరిస్థితులు శాంతించిన వెంటనే, నేను వెంటనే ప్రయాణాన్ని బుక్ చేసుకుంటాను." అని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగుపడకపోతే, తాను ఈ సంవత్సరం సౌదీ అరేబియాను సందర్శిస్తాను అని తెలిపారు.
అబుదాబికి చెందిన ఎమిరాటీ అయిన అబ్దుల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తాడు. అతను తన రాబోయే పర్యటన పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, "నేను రేపు ఉదయాన్నే విశ్రాంతి యాత్ర కోసం ఇండోనేషియాకు వెళ్తున్నాను. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం" అని చెప్పాడు. అతను 12 రోజులు ఉండాలనుకుంటున్నాడు. "నేను ఖతార్ ఎయిర్వేస్లో నా విమానాన్ని బుక్ చేసుకున్నాను. ఇండోనేషియాకు వెళ్లే మార్గం సురక్షితంగా ఉంది." అని తెలిపారు.
దుబాయ్కు చెందిన ఎమిరాటీ అయిన అల్ ముహన్నది తన తండ్రి తరపు బంధువులను కలుసుకునేందుకు వేసవి పర్యటనను ప్లాన్ చేస్తున్నాడు. "నేను పరిస్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నారు. విమానాలు సర్వీసులు నిలిచిపోతే.. నేను రోడ్డు మార్గం ద్వారా తిరిగి రాగలను." అని తెలిపాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా యూఏఈ నివాసితులు జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్లకు తమ వేసవి ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!









