యోగా నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు: హోంమంత్రి అనిత
- June 18, 2025
విజయనగరం: యోగా జీవన విధానంలో భాగం కావాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ యోగా కార్యక్రమానికి అత్యంత ప్రధాన్యతనిస్తున్నారని, ఒకే రోజు ఒకే చోట 5 లక్షల మందితో విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ చార్జ్ మంత్రి రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాల శాఖామంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డిలతో కలసి ఈ నెల 21న నిర్వహించే యోగా కార్యక్రమంపై మూడు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ చార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీక్ష బూనారని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు.
నెల రోజుల నుండి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరినీ సన్నద్ధం చేయడం జరుగుతోందని తెలిపారు. విశాఖపట్నంలో ఒకే రోజున ఒకే వేదిక నుండి 5 లక్షల మంది యోగ చేయడం ద్వారా దేశమంతా వైజాగ్ వైపు చూస్తుందని, అంతే కాకుండా గిన్నిస్ బుక్ స్థానం సంపాదిస్తామని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలనీ కోరారు. యోగా కార్యక్రమానికి వచ్చే వారికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులను వేసి రహదారి మార్గంలో అత్యవసరాల కోసం వాష్ రూమ్స్ న్ను గుర్తించడం జరిగిందని, వాటిని బస్సులతో మ్యాప్ చేయడం జరిగిందని, అలాగే మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఉదయాన్నే బస్సులు బయలుదేరతాయి కావున ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గం వారీగా సచివాలయం వారీగా నమోదు చేసుకున్న జాబితాలను సంబంధిత శాసన సభ్యులకు ఇవ్వాలని, వారు వారి కార్యకర్తల ద్వారా జన సమీకరణ లో భాగస్వామ్యులవుతారని తెలిపారు.సురక్షితంగా గమ్యాలను చేరే వరకు ఇన్ ఛార్జ్ లు బాధ్యత తీసుకోవాలని, అలాగే ట్రాఫిక్ నియంత్రణకు జాతీయ రహదారిపై హెవీ వాహనాలను తిరగకుండా నిరోధించాలని సూచించారు.
యోగా వేదిక వద్ద కంపార్ట్మెంట్లను కేటాయించడం జరుగుతుందని, ఎవరికీ ఏ కంపార్ట్మెంట్ కేటాయించారో, ఆ నెంబర్ వారు వెళ్ళే బస్సు పైన రాయడం జరుగుతుందని దాని ప్రకారంగా ఎటువంటి ఆందోళన పడకుండా ఇన్ ఛార్జ్ జాగ్రత్తగా తీసుకువెళ్లాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లా నుండి 36 వేల మందిని సిద్ధం చేసుకున్నామని, కనీసం 30 వేల మందిని పంపడానికి 2 రూట్లలో 660 బుస్సు లను సిద్ధం చేసామని, ప్రతి బస్సు కు ఒక లైజెన్ అధికారిని నియమించామని, సచివాలయం వారీగా బస్సులను, టాయిలెట్లను మాప్ చేయడం జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









