ఇరాన్ వాసులకు యూఏఈ సాంత్వన.. ఓవర్స్టే జరిమానాలు రద్దు..!!
- June 18, 2025
దోహా, ఖతార్: ఇరానియన్ పౌరులు, నివాసితులు లేదా సందర్శకులకు వీసా ఓవర్స్టే జరిమానాలను రద్దు చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రకటించింది. "ఈ ప్రాంతంలోని అసాధారణ పరిస్థితుల" కారణంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వైమానిక ప్రదేశాల మూసివేత, విమాన సర్వీసుల సస్పెన్షన్ల కారణంగా ఇరాన్కు తిరిగి వెళ్లలేని వ్యక్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అర్హత ఉన్నవారు మినహాయింపు నుండి ప్రయోజనం పొందడానికి ICP స్మార్ట్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేదా ఏదైనా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ను సందర్శించాలన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









