ఇరాన్ వాసులకు యూఏఈ సాంత్వన.. ఓవర్స్టే జరిమానాలు రద్దు..!!
- June 18, 2025
దోహా, ఖతార్: ఇరానియన్ పౌరులు, నివాసితులు లేదా సందర్శకులకు వీసా ఓవర్స్టే జరిమానాలను రద్దు చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రకటించింది. "ఈ ప్రాంతంలోని అసాధారణ పరిస్థితుల" కారణంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వైమానిక ప్రదేశాల మూసివేత, విమాన సర్వీసుల సస్పెన్షన్ల కారణంగా ఇరాన్కు తిరిగి వెళ్లలేని వ్యక్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అర్హత ఉన్నవారు మినహాయింపు నుండి ప్రయోజనం పొందడానికి ICP స్మార్ట్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేదా ఏదైనా కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ను సందర్శించాలన్నారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







