విశాఖ యోగాంధ్ర-2025కు గిన్నిస్ రికార్డు..
- June 21, 2025
విశాఖపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఒకే స్ట్రెచ్లో మూడు లక్షల 20వేల మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు.దీంతోపాటు 25వేల మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం ఒకేచోట చేసిన సూర్య నమస్కారాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను అందజేశారు.
గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును (1.47లక్షల మంది) ప్రస్తుతం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 అధిగమించింది. విశాఖ నగరంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ లకు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను నిర్వాహకులు అందజేశారు.
విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025కు గిన్నిస్ వరల్డ్ రికార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని, ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయవంతమైందని, ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలు భారీఎత్తున పాల్గొన్నారని లోకేశ్ పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన ఐటీ హబ్ గా విశాఖపట్టణంను తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ