సూడాన్‌ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు

- July 13, 2016 , by Maagulf
సూడాన్‌ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు

అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దక్షిణ సూడాన్‌ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రెండు సీ-17 సైనిక రవాణా విమానాలను గురువారం దక్షిణ సుడాన్‌ రాజధాని జుబాకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది భారతీయులు దక్షిణ సూడాన్‌లో చిక్కుకున్నారు. సహాయ కార్యక్రమాలను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ పర్యవేక్షిస్తున్నారు.

గతేడాది యెమెన్‌లో చిక్కుకున్న దాదాపు 4వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన వీకే సింగ్‌ మరోసారి బాధ్యత తీసుకున్నట్లు విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్వీట్‌ చేశారు. సరైన ఇండియన్‌ ట్రావెల్‌ డాక్యుమెంట్లతో దక్షిణ సుడాన్‌ వెళ్లిన భారతీయులను మాత్రమే భారత్‌కు అనుమతిస్తామని కేవలం 5కిలోల సామానును మాత్రమే వారితో తీసుకువచ్చేందుకు వీలుంటుందని తెలిపారు. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 600 మంది భారతీయుల్లో 450 మంది జుబాలో ఉండగా మిగతా 150 మంది వేరే ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com