సూడాన్ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు
- July 13, 2016
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న దక్షిణ సూడాన్ నుంచి భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రెండు సీ-17 సైనిక రవాణా విమానాలను గురువారం దక్షిణ సుడాన్ రాజధాని జుబాకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది భారతీయులు దక్షిణ సూడాన్లో చిక్కుకున్నారు. సహాయ కార్యక్రమాలను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
గతేడాది యెమెన్లో చిక్కుకున్న దాదాపు 4వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన వీకే సింగ్ మరోసారి బాధ్యత తీసుకున్నట్లు విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. సరైన ఇండియన్ ట్రావెల్ డాక్యుమెంట్లతో దక్షిణ సుడాన్ వెళ్లిన భారతీయులను మాత్రమే భారత్కు అనుమతిస్తామని కేవలం 5కిలోల సామానును మాత్రమే వారితో తీసుకువచ్చేందుకు వీలుంటుందని తెలిపారు. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 600 మంది భారతీయుల్లో 450 మంది జుబాలో ఉండగా మిగతా 150 మంది వేరే ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







