ఆసుపత్రి పరికరాలు వేలం.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..!!
- June 25, 2025
యూఏఈ: దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సంచలన తీర్పు వెలువరించింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి బకాయిలను చెల్లించడానికి సిటీ వాక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వైద్య పరికరాలను వేలం వేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పును అనుసరించి.. జూలై 8న ఎమిరేట్స్ ఆక్షన్ తన రాస్ అల్ ఖోర్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
కొనుగోలుదారులు వేలం సంస్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా బిడ్ చేయవచ్చని తెలిపింది. అనేక మంది ఆసుపత్రి సిబ్బంది ఈ కేసును దాఖలు చేశారు. సుమారు Dh3.07 మిలియన్ల వరకు జీతాల బకాయిలను వేలం ద్వారా వచ్చిన సొమ్ముతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆసుపత్రి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







