ఆసుపత్రి పరికరాలు వేలం.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..!!
- June 25, 2025
యూఏఈ: దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సంచలన తీర్పు వెలువరించింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి బకాయిలను చెల్లించడానికి సిటీ వాక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వైద్య పరికరాలను వేలం వేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పును అనుసరించి.. జూలై 8న ఎమిరేట్స్ ఆక్షన్ తన రాస్ అల్ ఖోర్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
కొనుగోలుదారులు వేలం సంస్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా బిడ్ చేయవచ్చని తెలిపింది. అనేక మంది ఆసుపత్రి సిబ్బంది ఈ కేసును దాఖలు చేశారు. సుమారు Dh3.07 మిలియన్ల వరకు జీతాల బకాయిలను వేలం ద్వారా వచ్చిన సొమ్ముతో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆసుపత్రి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







