అరబ్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- June 26, 2025
మనామా: ఈ నవంబర్లో జరిగే అరబ్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(AICS 2025) కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది.క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్, ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో.. బహ్రెయిన్ అరబ్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ , ఎగ్జిబిషన్ (AICS 2025) 3వ ఎడిషన్ను నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమం నవంబర్ 5 నుండి 6 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది.నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ నిర్వహించే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు, నిర్ణయాధికారులు మరియు ప్రతినిధులు పాల్గొంటారు.
AICS 2025లో ఒక హై-ప్రొఫైల్ టెక్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. తాజా ఆవిష్కరణలు, సమస్యలు- పరిష్కారాలు, సాంకేతికతలను ప్రదర్శించే ప్రముఖ అంతర్జాతీయ సైబర్ భద్రతా సంస్థల భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. డిజిటల్ టెక్నాలజీలో తాజా ఆవిష్కరణలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ను మారుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు







