చట్టాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం..239 మంది అరెస్టు..!!
- June 27, 2025
కువైట్ః రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. పెద్ద ఎత్తున భద్రతా ఆపరేషన్లో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని గవర్నరేట్లలో ఇంటెన్సివ్ ఫీల్డ్ క్యాంపెయిన్లను నిర్వహించింది.మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు.. మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 239 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, అరెస్టు చేసిన వారిని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









