చట్టాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం..239 మంది అరెస్టు..!!
- June 27, 2025
కువైట్ః రెసిడెన్సీ, లేబర్ చట్టాల ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. పెద్ద ఎత్తున భద్రతా ఆపరేషన్లో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని గవర్నరేట్లలో ఇంటెన్సివ్ ఫీల్డ్ క్యాంపెయిన్లను నిర్వహించింది.మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు.. మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 239 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, అరెస్టు చేసిన వారిని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







