కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 42కి చేరిన మృతుల సంఖ్య
- July 01, 2025
హైదరాబాద్: తెలంగాణలోని పశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో సోమవారం సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది.ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేడు సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య 42కి చేరింది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రాత్రి వరకు 12గా ఉన్న మృతుల సంఖ్య, మంగళవారం ఉదయానికి 34కి పెరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు లభ్యం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. "శిథిలాలను తొలగిస్తుండగా మరికొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. సహాయక చర్యలు చివరి దశలో ఉన్నాయి" అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు.
గవర్నర్ దిగ్భ్రాంతి..సహాయక చర్యలపై ఆదేశాలు
ఈ విషాద ఘటనపై తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. డాన్ కిషోర్తో ఫోన్లో మాట్లాడారు. పేలుడు బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని వెంటనే అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









