కువైట్ లో అమల్లోకి ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్..!!
- July 02, 2025
కువైట్: కువైట్ లో ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులు దేశం నుండి బయటకు వెళ్లే ముందు వారి యజమాని నుండి ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. “ఈసెల్” లేబర్ పోర్టల్ లేదా “సహెల్ – ఇండివిజువల్” మొబైల్ యాప్ని ఉపయోగించి ఇప్పటికే 35,000 కంటే ఎక్కువ డిపార్చర్ పర్మిట్లు పొందారు.
అయితే, పర్మిట్ మంజూరు చేయడానికి నిరాకరించే యజమానుల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు తెలిపారు. ఏవరైనా కార్మికుడు తిరస్కరణను ఎదుర్కొంటే, వారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ కింద లేబర్ రిలేషన్స్ యూనిట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
కాగా, యజమాని ఆమోదించినంత వరకు ఒక కార్మికుడు సంవత్సరంలో ఎన్నిసార్లు డిపార్చర్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదన్నారు. కార్మికులు సులభమైన కంపెనీల లేబర్ పోర్టల్ లేదా సాహెల్ - ఇండివిజువల్ ప్రభుత్వ యాప్ ద్వారా ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









