కువైట్ లో అమల్లోకి ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్..!!
- July 02, 2025
కువైట్: కువైట్ లో ప్రవాస కార్మికుల కోసం కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూల్స్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులు దేశం నుండి బయటకు వెళ్లే ముందు వారి యజమాని నుండి ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. “ఈసెల్” లేబర్ పోర్టల్ లేదా “సహెల్ – ఇండివిజువల్” మొబైల్ యాప్ని ఉపయోగించి ఇప్పటికే 35,000 కంటే ఎక్కువ డిపార్చర్ పర్మిట్లు పొందారు.
అయితే, పర్మిట్ మంజూరు చేయడానికి నిరాకరించే యజమానుల గురించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు తెలిపారు. ఏవరైనా కార్మికుడు తిరస్కరణను ఎదుర్కొంటే, వారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ కింద లేబర్ రిలేషన్స్ యూనిట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
కాగా, యజమాని ఆమోదించినంత వరకు ఒక కార్మికుడు సంవత్సరంలో ఎన్నిసార్లు డిపార్చర్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదన్నారు. కార్మికులు సులభమైన కంపెనీల లేబర్ పోర్టల్ లేదా సాహెల్ - ఇండివిజువల్ ప్రభుత్వ యాప్ ద్వారా ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







