షార్జాలో 2 నెలల పాటు రెండు కీలక రోడ్లు మూసివేత..!!
- July 02, 2025
దుబాయ్: యూఏఈ అంతటా రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టారు ఎతిహాద్ రైలు ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రధాన వీధులను రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా రోడ్లు, రవాణా అథారిటీ ప్రకటించింది. ఈ చొరవ ట్రాఫిక్ మళ్లింపులకు కారణమవుతుందని భావిస్తున్నారు. కానీ ఎమిరేట్ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను హామీ ఇస్తుందని పేర్కొన్నారు. మూసివేయబోయే రోడ్లు యూనివర్సిటీ బ్రిడ్జి సమీపంలోని మ్లీహా రోడ్, షార్జా రింగ్ రోడ్ను అనుసంధానించే రోడ్లు అనితెలిపారు. మూసివేత ఆంక్షలు రెండు నెలల పాటు(జూలై 1 -ఆగస్టు 30 వరకు) కొనసాగుతాయని వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







