షార్జాలో 2 నెలల పాటు రెండు కీలక రోడ్లు మూసివేత..!!
- July 02, 2025
దుబాయ్: యూఏఈ అంతటా రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టారు ఎతిహాద్ రైలు ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రధాన వీధులను రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా రోడ్లు, రవాణా అథారిటీ ప్రకటించింది. ఈ చొరవ ట్రాఫిక్ మళ్లింపులకు కారణమవుతుందని భావిస్తున్నారు. కానీ ఎమిరేట్ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను హామీ ఇస్తుందని పేర్కొన్నారు. మూసివేయబోయే రోడ్లు యూనివర్సిటీ బ్రిడ్జి సమీపంలోని మ్లీహా రోడ్, షార్జా రింగ్ రోడ్ను అనుసంధానించే రోడ్లు అనితెలిపారు. మూసివేత ఆంక్షలు రెండు నెలల పాటు(జూలై 1 -ఆగస్టు 30 వరకు) కొనసాగుతాయని వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









