హిమాచల్ ప్రదేశ్లో వరదలు..51 మంది మృతి
- July 02, 2025
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో నీరు పొంగిపొర్లి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. పిడుగుపాటు, కొండచరియలు విరిగిపడటం, వరదల్లో కొట్టుకుపోవడం వంటి ఘటనల్లో ఈ మరణాలు జరిగాయని వివరించింది.
22 మంది గల్లంతు, అనేక ప్రాంతాల్లో ఆస్తినష్టం
ప్రస్తుత నివేదికల ప్రకారం, 22 మంది వరదల కారణంగా గల్లంతు అయ్యారు. ఇంకా వారు సజీవంగా ఉన్నారా లేక మరణించారా అన్న విషయమై అధికారులు సుమారుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వరదల (Floods ) ధాటికి ప్రభుత్వ భవనాలు, రహదారులు, వంతెనలు, ప్రైవేట్ ఇళ్లతో పాటు పశు సంపద కూడా తీవ్రంగా నష్టపోయింది. 12 జిల్లాల్లో ఈ విధ్వంసం తీవ్రంగా ఉండగా, పునరుద్ధరణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
అధికార యంత్రాంగం హై అలర్ట్లో
వర్షాభావ ప్రాంతంగా గుర్తించబడిన హిమాచల్ ప్రదేశ్ ఈసారి భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ప్రాణనష్టం తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం హై అలర్ట్లో పని చేస్తోంది. సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ ఎత్తున నష్టమున్న ప్రాంతాల్లో సకాలంలో చేరి బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులను ఆ ప్రాంతాలకి వెళ్లకూడదని సూచనలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









