ఏపీలో రేపు ప్రైవేట్ స్కూళ్లు బంద్..!
- July 02, 2025అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ పాఠశాలలు గురువారం (జూలై 3) బంద్ పాటించనున్నాయని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రకటించింది. విద్యా శాఖలో అధికారులు అనుసరిస్తున్న తీరుపై నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చింది. అధికారుల తనిఖీలు, నోటీసులు, అతివాద చర్యలతో పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అసోసియేషన్ ఆరోపించింది. అందుకే తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒకరోజు పాఠశాలలను మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. కానీ అధికారుల తీరు పై ఆగ్రహం
ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం పలు విధాలుగా సహకరిస్తున్నప్పటికీ, జిల్లాల అధికారుల మానవీయతలేని విధానం వల్ల స్కూళ్లు ఇబ్బందులు పడుతున్నాయని పాఠశాల యాజమాన్యాలు పేర్కొన్నాయి.ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును 10 సంవత్సరాల వరకు పొడిగించినందుకు, విద్యార్థులకు “తల్లికి వందనం”, ప్రతిభా అవార్డుల వంటి పథకాల ద్వారా మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం మంచి పని చేస్తోందని వారు అభినందించారు. అయితే అదే సమయంలో, కొన్ని కమిటీల విచారణలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేయడం, హడావుడిగా తనిఖీలు చేయడం యాజమాన్యాలను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
విధుల్లో జోక్యం మానాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఆఫీసర్లు తమ అధికారాలను అతి వేగంగా వినియోగిస్తూ, నియమాలు సరిగా అధ్యయనం చేయకుండా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆరోపించాయి. దీంతో టీచర్లు, సిబ్బంది, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాము ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలని, నిర్ణయాలు తీసుకునే ముందు సదుద్దేశంతో చర్చలు జరపాలని కోరారు. బంద్ దృష్ట్యా తల్లిదండ్రులు, విద్యార్థులు జూలై 3న పాఠశాలలకు వెళ్లకూడదని సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









