దక్షిణ సూడాన్కి చేరుకున్న సహాయక అధికారులు
- July 14, 2016
దక్షిణ సూడాన్లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి 500మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ నేతృత్వంలోని సహాయక అధికారుల బృందం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దక్షిణ సూడాన్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాలు రేపు తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్టులకు చేరుకోనున్నాయి. భారతీయుల బృందంలో ఉన్న 54మంది తెలంగాణవాసులు స్వదేశానికి చేరుకోనున్నారు. తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రెసిడెన్స్ కమిషనర్ శశాంక్గోయల్ విదేశాంగ, రైల్వే అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు శశాంక్గోయల్ చెప్పారు. రైళ్లు లేదా విమానంలో తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపుతమని తెలిపారు. తిరువనంతపురం చేరుకున్న వారికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







