దక్షిణ సూడాన్కి చేరుకున్న సహాయక అధికారులు
- July 14, 2016
దక్షిణ సూడాన్లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి 500మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ నేతృత్వంలోని సహాయక అధికారుల బృందం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దక్షిణ సూడాన్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాలు రేపు తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్టులకు చేరుకోనున్నాయి. భారతీయుల బృందంలో ఉన్న 54మంది తెలంగాణవాసులు స్వదేశానికి చేరుకోనున్నారు. తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రెసిడెన్స్ కమిషనర్ శశాంక్గోయల్ విదేశాంగ, రైల్వే అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు శశాంక్గోయల్ చెప్పారు. రైళ్లు లేదా విమానంలో తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపుతమని తెలిపారు. తిరువనంతపురం చేరుకున్న వారికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









