ఐఐటీ విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు
- July 14, 2016
ఐఐటీ అంటేనే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థ.. అందులో ర్యాంకు రావడమే కష్టం. రిజర్వేషన్ లేని విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించాలి. వడ్డీలు అధికంగా ఉండటంతో రుణాలు తీసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారింది. దీంతో వారికి ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేసే విధంగా కేంద్రమానవవనరుల శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేయనున్నట్లు హెచ్ఆర్డీ అధికారులు చెబుతున్నారు. రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లించే విధంగా రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.90వేల నుంచి రూ. రెండులక్షలకు పెంచిన విషయం విదితమే. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, నిరుపేదలకు ఫీజులో పూర్తి మినహాయింపు ఇవ్వడం జరిగింది. పెంచిన ఫీజు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులపై భారం పడకుండా 'విద్యాలక్ష్మి' పథకం కింద వడ్డీలేని రుణాలను మంజూరు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







