శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్ కస్టమ్స్ అధికారులు

- July 14, 2016 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలోన్నర బంగారం సీజ్ కస్టమ్స్ అధికారులు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం భారీమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎమిరేట్ విమానంలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు తల్లీకొడుకులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ విమానం నుంచి దిగిన ప్రయాణికులను ప్రత్యేకంగా తనిఖీ చేయగా.. తల్లీకొడుకులు లో దుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం కిలోన్నర ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడినవారు కెన్యా దేశస్థులని.. తల్లీ కొడుకులుపైగా కెన్యా జాతీయులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడం ఇదే ప్రప్రథమమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com