క్రిప్టో పెట్టుబడిదారులకు నో గోల్డెన్ వీసా..!!
- July 07, 2025
యూఏఈ: క్రిప్టోకరెన్సీ టోన్కాయిన్లో పెట్టుబడిదారులకు గోల్డెన్ వీసా మంజూరు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను యూఏఈ ఖండించింది. డిజిటల్ కరెన్సీ పెట్టుబడిదారులను అధికారికంగా ఆమోదించిన నిర్దేశిత ప్రమాణాల ప్రకారం గోల్డెన్ వీసాలు జారీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ICP నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, కంపెనీల వ్యవస్థాపకులు, అత్యుత్తమ ప్రతిభావంతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, టాప్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్లు, మానవతావాద మార్గదర్శకులు , ఫ్రంట్లైన్ కార్మికులు వంటి నిర్దిష్ట వర్గాలకు దీర్ఘకాలిక నివాసం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP), సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA), వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ (Vara)లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఏదైనా లైసెన్స్ పొందిన "కంపెనీ" దుబాయ్ ప్రభుత్వం నిర్దేశించిన వీసా విధానాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టెలిగ్రామ్ ఆధారిత క్రిప్టో పర్యావరణ వ్యవస్థను నిర్వహించే టన్ ఫౌండేషన్ సీఈఓ మాక్స్ క్రౌన్.. Xలో స్పందించారు. టోన్కాయిన్ హోల్డర్లు ఇప్పుడు TONను స్టాక్ చేయడం ద్వారా యూఏఈ అత్యంత కోరుకునే గోల్డెన్ వీసాను పొందవచ్చు అని అన్నారు. ఇతర షరతులతో పాటు $35,000 వన్-టైమ్ రుసుము తర్వాత టన్ హోల్డర్లు "10 సంవత్సరాల గోల్డెన్ వీసాను పొందే ప్రత్యేక అవకాశం" కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
దుబాయ్లోని వర్చువల్ ప్రాపర్టీ పెట్టుబడిదారులకు గోల్డెన్ రెసిడెన్సీని మంజూరు చేస్తున్నారనే వాదనలు అవాస్తవమని తెలిపారు. పెట్టుబడిదారులు పూర్తిగా లైసెన్స్ పొందిన కంపెనీలతో మాత్రమే ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. గోల్డెన్ రెసిడెన్సీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ICP వెబ్సైట్ను సందర్శించవచ్చని వారు సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







