రెండవ పాస్పోర్ట్ తీసుకున్న వేలాది మంది యూఏఈ నివాసితులలో అనిశ్చితి..!!
- July 07, 2025
యూఏఈ: డొమినికా, సెయింట్ కిట్స్, నెవిస్, సెయింట్ లూసియా, కంబోడియా, ఈజిప్ట్ వంటి దేశాలలో పెట్టుబడుల ద్వారా పౌరసత్వం (CBI) పాస్పోర్ట్లను పొందిన వేలాది మంది యూఏఈ నివాసితులు తాము ఊహించని అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఈ పాస్పోర్ట్లు ప్రపంచ పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక భద్రతను అన్లాక్ చేస్తాయని నమ్మి కొందరు తమ జీవిత పొదుపులను పెట్టుబడి పెట్టారు. జూన్ 14న, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక మెమోరాండంపై సంతకం చేశారు. 36 దేశాలు - అనేక CBI ప్రోగ్రామ్లతో సహా ఆగస్టు 13తో ముగిసే 60 రోజుల గడువును ఇస్తూ, సమాచార-భాగస్వామ్య ప్రమాణాలను పాటించాలని లేదా వీసాలను నిషేధిస్తామని హెచ్చిరంచారు.
అదే సమయంలో బలహీనమైన పర్యవేక్షణ ఉన్న దేశాలకు వీసా-రహిత స్కెంజెన్ యాక్సెస్ను నిలిపివేయడానికి యూరోపియన్ యూనియన్ కూడా చట్టాన్ని ముందుకు తెస్తోంది. ఆమోదం పొందితే, సెప్టెంబర్ నాటికి చట్టం అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు.
భారతదేశం, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం నుండి వచ్చిన ప్రవాసులకు ఇది ఇబ్బందులు కలుగజేస్తుందని చెబుతున్నారు. ప్రపంచ ప్రయాణానికి రెండవ పౌరసత్వం ఒక ప్రసిద్ధ మార్గంగా మారింది. 140 కంటే ఎక్కువ దేశాలకు హామీ ఇచ్చే కరేబియన్, ఇతర CBI అధికార పరిధి నుండి పాస్పోర్ట్ల కోసం కుటుంబాలు సాధారణంగా $115,000 మరియు $330,000 మధ్య ఖర్చు చేశాయి.
ఇది ఒక అనిశ్చితి గల పరిస్థితి అని, చాలా మంది పాస్పోర్ట్ హోల్డర్లు దీనిని గతంలో చూడలేదని దుబాయ్కు చెందిన బయాత్ లీగల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సామ్ బయాత్ అన్నారు. "ప్రజలు పౌరసత్వ కార్యక్రమాలలో లక్షలాది డాలర్లను పెట్టుబడి పెట్టారు. అది ప్రపంచ స్వేచ్ఛకు తమ టికెట్ అని నమ్ముతున్నారు. ఇప్పుడు, వారు ఆ పాస్పోర్ట్లను ఆచరణాత్మకంగా పనికిరానిదిగా మార్చగల ఆకస్మిక ఆంక్షలను ఎదుర్కొంటున్నారు." అని తెలిపారు.
జనాభాలో దాదాపు 90 శాతం మంది ప్రవాసులుగా ఉన్న యూఏఈలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఖచ్చితమైన జాతీయత డేటా అందుబాటులో లేనప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతం నుండి 10,000 కంటే ఎక్కువ దరఖాస్తులు సెకండ్ పాస్ పోర్టు కోసం చేసారని బయాత్ తెలిపారు.
యూరోపియన్ కమిషన్ ప్రకారం, ఐదు తూర్పు కరేబియన్ CBI అధికార పరిధిలు ఆంటిగ్వా, బార్బుడా, డొమినికా, గ్రెనడా, సెయింట్ కిట్స్ & నెవిస్, సెయింట్ లూసియా - 2014 -2024 మధ్యకాలం మధ్య సమిష్టిగా 100,000 కంటే ఎక్కువ పౌరసత్వాలను జారీ చేశాయి.
యూఏఈలోని భారతీయ పౌరులలో ఈ సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. కాబట్టి రెండవ జాతీయతను ఎంచుకున్న చాలా మంది తమ భారతీయ పాస్పోర్ట్లను వదులుకోవలసి వచ్చింది. హెన్లీ & పార్టనర్స్ 2024 ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో 4,300 మంది సంపన్న భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వారిలో చాలామంది గల్ఫ్లో నివసిస్తున్నప్పుడు కరేబియన్ లేదా ఇతర CBI ప్రోగ్రామ్లను ఎంపిక చేసుకున్నారు.
గల్ఫ్లోని స్థానిక ఏజెన్సీలు, వీటిలో చాలా వరకు ఈ ప్రోగ్రామ్లను తక్కువ-రిస్క్, అధిక-రివార్డ్ పెట్టుబడులుగా మార్కెట్ చేశాయి. "కరేబియన్ పాస్పోర్ట్లపై తమ వ్యాపారాలను నిర్మించుకున్న డజన్ల కొద్దీ సంస్థలకు ఇది దాదాపు ముగింపు కావచ్చు" అని బయాట్ తెలిపారు.
2023 యూరోపియన్ కమిషన్ నివేదికలో కరేబియన్ రాష్ట్రాలు జారీ చేసిన 88,000 "గోల్డెన్ పాస్పోర్ట్లు" గురించి ప్రస్తావించింది. అమెరికా మెమోరాండం కంబోడియా, ఈజిప్ట్లను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈ సమస్య ఇకపై కరేబియన్కు మాత్రమే పరిమితం కాదనే సంకేతాలు ఇచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పెరుగుతున్న అనిశ్చితి మధ్య, చాలా మంది ప్రభావిత వ్యక్తులు సురక్షితమైన ప్రత్యామ్నాయాలను, ముఖ్యంగా యూఏఈ 10 సంవత్సరాల గోల్డెన్ వీసాను అన్వేషిస్తున్నారని రాయద్ గ్రూప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాయద్ కమల్ అయూబ్ తెలిపారు.
దాంతోపాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాయింట్ల ఆధారిత వ్యవస్థలు కూడా ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. "పౌరసత్వం అనేది ఒక సార్వభౌమ హక్కు, కానీ అది జారీ చేసే దేశం, వ్యక్తి రెండింటికీ బాధ్యతలను కలిగి ఉంటుంది" అని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







