తెలుగు మహిళ, బిడ్డ మృతి ఆస్ట్రేలియాలో !
- July 14, 2016
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ, బిడ్డ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గన్నారం గంగాధర్ కోడలు సుప్రజ, ఆరు నెలల బాబు మెల్బోర్న్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. గంగాధర్ కొడుకు శ్రీనివాస్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. భార్య సుప్రజ, కుమారుడితో అక్కడే ఉంటున్నారు. కాగా, శ్రీనివాస్ తల్లి ఇందిర అనారోగ్యంతో ఉండడంతో కోడలు, మనవడి మరణవార్తను తెలియనీయడం లేదు. వార్త తెలియగానే గంగాధర్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఆర్మూర్ నుంచి బయలుదేరారు. ఇంతకూ ఏం జరిగింది? అనే విషయంపై కుటుంబీకులకు సమాచారం లేదు. సుప్రజ తండ్రి ఫోన్ చేయగా.. గంగాధర్ హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







