సచిన్ కు అపూర్వ గౌరవం..
- July 10, 2025
లండన్: లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో ఇవాళ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇంగ్లండ్, ఇండియా మధ్య మూడో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో సచిన్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. స్టువర్ట్ పియర్సన్ రైట్ ఈ చిత్రపటాన్ని వేశారు. 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా ఆయిల్ పేయింట్స్తో దీన్ని వేశారు. ఈ ఏడాది చివరి వరకు మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పెవలియన్కు మార్చనున్నారు. గతంలో భారత మేటి క్రికెటర్లు కపిల్దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్సర్కర్ల పోట్రేట్లను కూడా పియర్సన్ వేశాడు.
ఈ సందర్బంగా సచిన్ మాట్లాడుతూ, లార్డ్స్లో తన చిత్రపటాన్ని ఉంచడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1983లో కపిల్దేవ్ వరల్డ్కప్ గెలిచిన సమయంలో.. తొలిసారి లార్డ్స్ స్టేడియాన్ని చూశానని, ఆ సందర్భం తన కండ్లల్లో ఉండిపోయిందని, ఇప్పుడు తన చిత్రపటం లార్డ్స్లో ప్రదర్శించడం .. తన క్రికెట్ కెరీర్ను గుర్తుకు తెస్తున్నట్లు సచిన్ తెలిపాడు. ఎంసీసీ క్లబ్లో ప్రస్తుతం మూడువేల ఫోటోలు ఉన్నాయి. దాంట్లో 300 వరకు పోట్రేట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







