సచిన్ కు అపూర్వ గౌరవం..
- July 10, 2025
లండన్: లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో ఇవాళ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇంగ్లండ్, ఇండియా మధ్య మూడో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో సచిన్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. స్టువర్ట్ పియర్సన్ రైట్ ఈ చిత్రపటాన్ని వేశారు. 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా ఆయిల్ పేయింట్స్తో దీన్ని వేశారు. ఈ ఏడాది చివరి వరకు మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పెవలియన్కు మార్చనున్నారు. గతంలో భారత మేటి క్రికెటర్లు కపిల్దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్సర్కర్ల పోట్రేట్లను కూడా పియర్సన్ వేశాడు.
ఈ సందర్బంగా సచిన్ మాట్లాడుతూ, లార్డ్స్లో తన చిత్రపటాన్ని ఉంచడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1983లో కపిల్దేవ్ వరల్డ్కప్ గెలిచిన సమయంలో.. తొలిసారి లార్డ్స్ స్టేడియాన్ని చూశానని, ఆ సందర్భం తన కండ్లల్లో ఉండిపోయిందని, ఇప్పుడు తన చిత్రపటం లార్డ్స్లో ప్రదర్శించడం .. తన క్రికెట్ కెరీర్ను గుర్తుకు తెస్తున్నట్లు సచిన్ తెలిపాడు. ఎంసీసీ క్లబ్లో ప్రస్తుతం మూడువేల ఫోటోలు ఉన్నాయి. దాంట్లో 300 వరకు పోట్రేట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









