ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..5 మంది మృతి..11 మందికి గాయాలు..!!
- July 11, 2025
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని ఒమన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు ఉన్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఒమానీలు, తొమ్మిది మంది ఎమిరాటీ పౌరులు ఉండగా.. వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.
గత వారం ఒమన్లో పిల్లలను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై నలుగురు మరణించిన ఘటన మరువక ముందే ఈ దుర్ఘటన జరిగింది. ఇజ్కి గవర్నరేట్లోని అల్-రుసైస్ ప్రాంతంలో ఒక బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ విషాద సంఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, ముగ్గురు పిల్లలు మరణించారు. 12 మంది పిల్లలు గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







