ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..5 మంది మృతి..11 మందికి గాయాలు..!!

- July 11, 2025 , by Maagulf
ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..5 మంది మృతి..11 మందికి గాయాలు..!!

మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని ఒమన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.   ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు ఉన్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఒమానీలు, తొమ్మిది మంది ఎమిరాటీ పౌరులు ఉండగా.. వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.

 గత వారం ఒమన్‌లో పిల్లలను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై నలుగురు మరణించిన ఘటన మరువక ముందే ఈ దుర్ఘటన జరిగింది.  ఇజ్కి గవర్నరేట్‌లోని అల్-రుసైస్ ప్రాంతంలో ఒక బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ విషాద సంఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, ముగ్గురు పిల్లలు మరణించారు. 12 మంది పిల్లలు గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com