ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..5 మంది మృతి..11 మందికి గాయాలు..!!
- July 11, 2025
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని ఒమన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు ఉన్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరు ఒమానీలు, తొమ్మిది మంది ఎమిరాటీ పౌరులు ఉండగా.. వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.
గత వారం ఒమన్లో పిల్లలను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై నలుగురు మరణించిన ఘటన మరువక ముందే ఈ దుర్ఘటన జరిగింది. ఇజ్కి గవర్నరేట్లోని అల్-రుసైస్ ప్రాంతంలో ఒక బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ విషాద సంఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, ముగ్గురు పిల్లలు మరణించారు. 12 మంది పిల్లలు గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!







