మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

- July 11, 2025 , by Maagulf
మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

హర్యానా: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో చోటుచేసుకున్న మహిళా టెన్నిస్ క్రీడాకారిణి హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.రాధికా యాదవ్(25) అనే యువతిని, సెక్టార్ 57 లోని తమ ఇంట్లో గన్‌తో కాల్చి చంపాడు తండ్రి. 5 రౌండ్ల కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడిన రాధిక యాదవ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులునిర్ధారించారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్‌లో 113వ స్థానంలో కొనసాగుతోంది మృతురాలు రాధికా యాదవ్. రాధిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? అది ఓ బతుకేనా ఇలాంటి సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. ఏకంగా కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. హర్యానాలోని గురుగ్రామ్‌ లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైన వార్త సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది.

తమ నివాసంలోనే ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.రాధికా యాదవ్‌ రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, కొద్ది కాలం క్రితం జరిగిన టెన్నీస్‌ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కృంగిపోయింది. అయితే తనలాగా టెన్నీస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు టెన్నీస్‌ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్‌తో రాధికా యాదవ్‌ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రికి కూడా చేదోడు వాదోడుగా నిలిచింది.అయితే దీపక్‌ యాదవ్‌ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు.

తన కుమార్తె కెరీర్, సంపాదనపై
రాధిక టెన్నిస్ అకాడమీ ఆదాయంపై దీపక్ ఆధారపడి జీవిస్తున్నాడని ఎగతాళి చేసేవారట. ఈ అవమానమే అతడి కోపాన్ని పెంచింది. రాధిక తన టెన్నిస్ అకాడమీ ని మూసివేయాలని తండ్రి కోరాడు.కానీ ఆమె అందుకు నిరాకరించింది. తన కుమార్తె కెరీర్, సంపాదనపై సమాజం నుంచి వస్తున్న విమర్శల కారణంగా కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్‌ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు.

మహిళా టెన్నిస్ అంటే ఏమిటి?
మహిళా టెన్నిస్ అనేది మహిళల మధ్య ఆడే టెన్నిస్ ఆట. ఇది సింగిల్స్ (ఒకరు vs ఒకరు) డబుల్స్ (ఇద్దరు vs ఇద్దరు) ఫార్మాట్లలో ఆడతారు. అంతర్జాతీయ స్థాయిలో WTA ఈ ఆటను నిర్వహిస్తుంది.

భారతదేశానికి చెందిన ప్రఖ్యాత మహిళా టెన్నిస్ క్రీడాకారిణులు ఎవరు?
సానియా మీర్జా–గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణి.అనుక్రితీ నారాయణ్, ఆస్తా అరోరా, కెమెష్ మాలిక్ లాంటి యువ క్రీడాకారిణులు కూడా ఎదుగుతున్నవారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com