జీహెచ్‌ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా..

- July 14, 2016 , by Maagulf
జీహెచ్‌ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా..

సమస్యలపై స్పందించేందుకుగాను జీహెచ్‌ఎంసీ నూతన యాప్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'మై జీహెచ్‌ఎంసీ యాప్‌'ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలు హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ అందించే అన్ని సేవలను యాప్ ద్వారా నగర పౌరులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా నగరంలోని సమస్యలపై ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com