156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..
- July 14, 2016యుద్ధంతో అట్టుడుకుతున్న దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. సీ-17 సైనిక విమానంలో 156మంది భారత్కు చేరుకున్నారు. అక్కడ చిక్కుకుపోయిన 600 మంది భారతీయులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సంకటమోచన్ చేపట్టిన సంగతి తెలిసిందే. సూడాన్లోని జుబా నుంచి వీరు ఈరోజు ఉదయం కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. భారతీయులను తీసుకొచ్చేందుకు సూడాన్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా వచ్చారు. భారత్ చేరుకున్న వారిలో ఇద్దరు నేపాలీలు కూడా ఉన్నారు. .కేరళ, తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తిరువనంతపురంలో దించిన తర్వాత మిగిలిన ప్రయాణికులతో విమానం దిల్లీ చేరుకుంది. మరికొందరు భారతీయులతో రెండో విమానం జుబా నుంచి బయలుదేరనుంది. కొందరు వ్యాపార అవసరాల దృష్ట్యా అక్కడే ఉండేందుకు మొగ్గు చూపారని.. అయితే ముందు రక్షణ ముఖ్యమని.. వ్యాపారం తర్వాతని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు వీకే సింగ్ తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్