ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025.. పిల్లల కేరింతలతో ప్రారంభం..!!
- July 14, 2025
దోహా: ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. పిల్లలు సరదాగా పాల్గొంటున్నారు. ఇంటరాక్టివ్ కార్యకలాపాలతో ఉత్సాహభరితమైన వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఆగస్టు 7 వరకు జరిగే ఈ క్యాంప్.. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడలు, విద్యా , వినోద కార్యకలాపాల సమగ్ర అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లేడీస్ స్పోర్ట్స్ హాల్లో వారానికి 5 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది.
ఈ సంవత్సరం కార్యక్రమంలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, ఆత్మరక్షణ, జిమ్నాస్టిక్స్, రిథమిక్ జిమ్నాస్టిక్స్ వంటి విస్తృత శ్రేణి క్రీడలు ఉన్నాయి. వీటితోపాటు దోహా అంతటా ప్రముఖ సాంస్కృతిక, వినోద ప్రదేశాలకు ఫీల్డ్ ట్రిప్లతో పాటు రీడింగ్, డ్రాయింగ్లో విద్యా వర్క్షాప్లను కూడా నిర్వహిస్తారు. వేసవి సెలవుల్లో పిల్లల శారీరక, సృజనాత్మక అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఈ శిబిరం కృషి చేస్తుందని ఆస్పైర్ జోన్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









