ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025.. పిల్లల కేరింతలతో ప్రారంభం..!!
- July 14, 2025
దోహా: ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. పిల్లలు సరదాగా పాల్గొంటున్నారు. ఇంటరాక్టివ్ కార్యకలాపాలతో ఉత్సాహభరితమైన వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఆగస్టు 7 వరకు జరిగే ఈ క్యాంప్.. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడలు, విద్యా , వినోద కార్యకలాపాల సమగ్ర అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లేడీస్ స్పోర్ట్స్ హాల్లో వారానికి 5 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది.
ఈ సంవత్సరం కార్యక్రమంలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, ఆత్మరక్షణ, జిమ్నాస్టిక్స్, రిథమిక్ జిమ్నాస్టిక్స్ వంటి విస్తృత శ్రేణి క్రీడలు ఉన్నాయి. వీటితోపాటు దోహా అంతటా ప్రముఖ సాంస్కృతిక, వినోద ప్రదేశాలకు ఫీల్డ్ ట్రిప్లతో పాటు రీడింగ్, డ్రాయింగ్లో విద్యా వర్క్షాప్లను కూడా నిర్వహిస్తారు. వేసవి సెలవుల్లో పిల్లల శారీరక, సృజనాత్మక అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఈ శిబిరం కృషి చేస్తుందని ఆస్పైర్ జోన్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







