సౌదీ స్టాక్ మార్కెట్..యూఏఈ, జీసీసీ నివాసులకు అనుమతి..!!
- July 14, 2025
రియాద్: యూఏఈ, ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నివాసితులు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి అనుమతించారు. ఈమేరకు సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సౌదీ అరేబియా మార్కెట్ ఆకర్షణను పెంచడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. GCC నివాసితులు ఇప్పుడు ప్రధాన మార్కెట్ అయిన తడావుల్లో నేరుగా పెట్టుబడులు చేయవచ్చు. తాజా సవరణలు గతంలో సౌదీ అరేబియా లేదా ఇతర GCC దేశాలలో నివసించిన వ్యక్తిగత విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ఖాతాలను నిర్వహించడానికి, ప్రధాన మార్కెట్లోని లిస్టెడ్ షేర్లలో ట్రేడింగ్ కొనసాగించడానికి అనుమతిస్తాయి.
సౌదీ అరేబియా గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కు కేంద్రంగా ఉంది. 2025 మొదటి అర్ధభాగంలో ఇది $183.5 బిలియన్ల ట్రేడింగ్ విలువను నమోదు చేసింది. అదే సమయంలో అబుదాబి $48.9 బిలియన్లు, కువైట్ $41.1 బిలియన్లు, దుబాయ్ $22.8 బిలియన్లు, ఖతార్ $14.6 బిలియన్లు, మస్కట్ $2.4 బిలియన్లు, బహ్రెయిన్ $1.24 బిలియన్లు నమోదు చేసింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







