సౌదీ స్టాక్ మార్కెట్..యూఏఈ, జీసీసీ నివాసులకు అనుమతి..!!
- July 14, 2025
రియాద్: యూఏఈ, ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నివాసితులు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి అనుమతించారు. ఈమేరకు సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సౌదీ అరేబియా మార్కెట్ ఆకర్షణను పెంచడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. GCC నివాసితులు ఇప్పుడు ప్రధాన మార్కెట్ అయిన తడావుల్లో నేరుగా పెట్టుబడులు చేయవచ్చు. తాజా సవరణలు గతంలో సౌదీ అరేబియా లేదా ఇతర GCC దేశాలలో నివసించిన వ్యక్తిగత విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ఖాతాలను నిర్వహించడానికి, ప్రధాన మార్కెట్లోని లిస్టెడ్ షేర్లలో ట్రేడింగ్ కొనసాగించడానికి అనుమతిస్తాయి.
సౌదీ అరేబియా గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కు కేంద్రంగా ఉంది. 2025 మొదటి అర్ధభాగంలో ఇది $183.5 బిలియన్ల ట్రేడింగ్ విలువను నమోదు చేసింది. అదే సమయంలో అబుదాబి $48.9 బిలియన్లు, కువైట్ $41.1 బిలియన్లు, దుబాయ్ $22.8 బిలియన్లు, ఖతార్ $14.6 బిలియన్లు, మస్కట్ $2.4 బిలియన్లు, బహ్రెయిన్ $1.24 బిలియన్లు నమోదు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







