సౌదీ స్టాక్ మార్కెట్..యూఏఈ, జీసీసీ నివాసులకు అనుమతి..!!
- July 14, 2025
రియాద్: యూఏఈ, ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నివాసితులు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి అనుమతించారు. ఈమేరకు సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సౌదీ అరేబియా మార్కెట్ ఆకర్షణను పెంచడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. GCC నివాసితులు ఇప్పుడు ప్రధాన మార్కెట్ అయిన తడావుల్లో నేరుగా పెట్టుబడులు చేయవచ్చు. తాజా సవరణలు గతంలో సౌదీ అరేబియా లేదా ఇతర GCC దేశాలలో నివసించిన వ్యక్తిగత విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ఖాతాలను నిర్వహించడానికి, ప్రధాన మార్కెట్లోని లిస్టెడ్ షేర్లలో ట్రేడింగ్ కొనసాగించడానికి అనుమతిస్తాయి.
సౌదీ అరేబియా గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కు కేంద్రంగా ఉంది. 2025 మొదటి అర్ధభాగంలో ఇది $183.5 బిలియన్ల ట్రేడింగ్ విలువను నమోదు చేసింది. అదే సమయంలో అబుదాబి $48.9 బిలియన్లు, కువైట్ $41.1 బిలియన్లు, దుబాయ్ $22.8 బిలియన్లు, ఖతార్ $14.6 బిలియన్లు, మస్కట్ $2.4 బిలియన్లు, బహ్రెయిన్ $1.24 బిలియన్లు నమోదు చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







