సౌదీ స్టాక్ మార్కెట్..యూఏఈ, జీసీసీ నివాసులకు అనుమతి..!!
- July 14, 2025
రియాద్: యూఏఈ, ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నివాసితులు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి అనుమతించారు. ఈమేరకు సౌదీ అరేబియా క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సౌదీ అరేబియా మార్కెట్ ఆకర్షణను పెంచడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది.
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. GCC నివాసితులు ఇప్పుడు ప్రధాన మార్కెట్ అయిన తడావుల్లో నేరుగా పెట్టుబడులు చేయవచ్చు. తాజా సవరణలు గతంలో సౌదీ అరేబియా లేదా ఇతర GCC దేశాలలో నివసించిన వ్యక్తిగత విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ఖాతాలను నిర్వహించడానికి, ప్రధాన మార్కెట్లోని లిస్టెడ్ షేర్లలో ట్రేడింగ్ కొనసాగించడానికి అనుమతిస్తాయి.
సౌదీ అరేబియా గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కు కేంద్రంగా ఉంది. 2025 మొదటి అర్ధభాగంలో ఇది $183.5 బిలియన్ల ట్రేడింగ్ విలువను నమోదు చేసింది. అదే సమయంలో అబుదాబి $48.9 బిలియన్లు, కువైట్ $41.1 బిలియన్లు, దుబాయ్ $22.8 బిలియన్లు, ఖతార్ $14.6 బిలియన్లు, మస్కట్ $2.4 బిలియన్లు, బహ్రెయిన్ $1.24 బిలియన్లు నమోదు చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!









