ఏపీ: మరో 3 రోజులపాటు వర్షాలు
- July 18, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్(AP)లో వాతావరణం మళ్లీ మారిపోతోంది.రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వర్షాల కారణంగా రహదారి, వ్యవసాయ, విద్యుత్ వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ప్రయాణాలు తక్కువగా చేయాలని సూచించారు.
వర్ష ప్రభావానికి గురయ్యే జిల్లాలు
జూలై 19వ తేదీ నుంచి వర్షాలు ముంచెత్తే అవకాశముందని, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు (మన్యం), ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని APSDMA తెలిపింది. ఈదురుగాలులు, మెరుపులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
జాగ్రత్తలు తీసుకోండి: APSDMA సూచనలు
ప్రజలు వర్ష కాలంలో అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పునాదులు బలహీనంగా ఉన్న ఇల్లు, చెట్లు, విద్యుత్ స్తంభాల దరిచేరవద్దని హెచ్చరించారు. రైతులు పంట పొలాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించగా, తోటల్ని నీరు నిలవకుండా కాపాడాలని కోరారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని APSDMA సూచించింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







