భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై సంతకాలు!
- July 24, 2025
లండన్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా (జూలై 24) లండన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ఆయన కీలకంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో భారత్-యూకే మధ్య చారిత్రక ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. కాగా, భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించిన విషయం తెలిసిందే. 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు. భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు.
అంతకు ముందు యూకే పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన చాలా దోహదపడుతుందన్నారు. మన ప్రజలకు శ్రేయస్సు, వృద్ధి ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం-యూకే స్నేహం చాలా అవసరమని తెలిపారు.ఇక్కడి భారతీయ సమాజం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం తనను కదిలించిందని వెల్లడించారు.భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం మక్కువ నిజంగా నా హృదయాన్ని తాకిందని ప్రధాని ట్వీట్ చేశారు.
యుకె-ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక ముఖ్యమైన విజయం.ఇది యుకె మరియు భారతీయ వ్యాపారాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత డైనమిక్ మార్కెట్లలో ఒకదానికి ఎక్కువ ప్రాప్యతను కల్పిస్తుంది మరియు యుకె-ఇండియా కారిడార్ అంతటా వృద్ధి మరియు ఆవిష్కరణలను నడిపిస్తుంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2013-14 నుండి 2017-18 వరకు మరియు 2020-21లో కూడా చైనా భారతదేశానికి అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనాకు ముందు, యుఎఇ ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2021-22 నుండి అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉంది .
2023-24లో భారతదేశం 27 EU సభ్య దేశాలలో 19 దేశాలతో వాణిజ్య మిగులును కొనసాగించింది. నెదర్లాండ్స్ , స్పెయిన్, ఇటలీ మరియు పోర్చుగల్ వంటి దేశాలు వాణిజ్య మిగులులో అత్యంత ముఖ్యమైన వాణిజ్య సమతుల్యతను కలిగి ఉన్నాయి, ఇది ఈ మార్కెట్లలో భారతదేశం యొక్క పెరుగుతున్న పరిధి మరియు పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







