అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- July 18, 2026
రియాద్: సౌదీ సెంటర్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ (SCOT) సమన్వయంతో బ్రెయిన్ డెడ్ చెందిన డోనర్స్ నుంచి అవయవాలను సేకరించి 12 మంది రోగులకు విజయవంతంగా మార్పిడి చేశారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఐదు అవయవ సేకరణ ప్రక్రియల్లో నాలుగు కేవలం 48 గంటల్లోనే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రెండు హార్ట్, రెండు లీవర్ , రెండు లంగ్స్ , ఆరు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో చివరి దశ అవయవ వైఫల్యంతో బాధపడుతున్న పలువురికి కొత్త జీవితం లభించింది.
అవయవాల కేటాయింపును పూర్తిగా వైద్య నైతిక ప్రమాణాలు, అత్యవసరత ఆధారంగా పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్సీఓటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తలాల్ అల్-ఖౌఫీ తెలిపారు. అవయవదానానికి అంగీకరించిన దాతల కుటుంబాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సౌదీలో అవయవదానం కోసం ప్రజలు తవక్కల్నా ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







