అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- July 18, 2026
రియాద్: సౌదీ సెంటర్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ (SCOT) సమన్వయంతో బ్రెయిన్ డెడ్ చెందిన డోనర్స్ నుంచి అవయవాలను సేకరించి 12 మంది రోగులకు విజయవంతంగా మార్పిడి చేశారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఐదు అవయవ సేకరణ ప్రక్రియల్లో నాలుగు కేవలం 48 గంటల్లోనే పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రెండు హార్ట్, రెండు లీవర్ , రెండు లంగ్స్ , ఆరు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో చివరి దశ అవయవ వైఫల్యంతో బాధపడుతున్న పలువురికి కొత్త జీవితం లభించింది.
అవయవాల కేటాయింపును పూర్తిగా వైద్య నైతిక ప్రమాణాలు, అత్యవసరత ఆధారంగా పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్సీఓటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తలాల్ అల్-ఖౌఫీ తెలిపారు. అవయవదానానికి అంగీకరించిన దాతల కుటుంబాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సౌదీలో అవయవదానం కోసం ప్రజలు తవక్కల్నా ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







