వేడి వాతావరణం కారణంగా పని వేళలు మార్చనున్న కతర్ కంపెనీలు
- July 15, 2016వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న కతర్ లో బయట పనిచేసే కార్మికులు తమకు ఉదయం వేళలో లేదా సాయంత్రం వేళలో పని సమయాలను కేటాయించాలని కతర్ లోని పలు నిర్మాణ సంస్థలను కోరారు.పగటి ఉష్ణోగ్రతలు దేశంలో క్రమేపీ పెరుగుతుండటం నలభై డిగ్రీల కంటే ఎక్కువగా వేడి పెరుగుతుండటంతో నిర్మాణల కంపెనీలు కార్మికుల ఉపశమనం కల్గించేందుకు పని వేళలో ఈ మార్పు బలవంతంగా చేశారు. దీనితో కార్మికులకు పని వేళలు ఉదయం లేదా సాయంత్రం వేళలో మార్పులు కారణంగా పని సులభంగా జరగడమే కాక ఉత్పాదకత మెరుగుపడి మరియు నిర్మాణ ప్రాంతాలలో పని గమనం మెరుగుపడింది. మంత్రిత్వ శాఖ విధించిన నిబంధన ప్రకారం మధ్యాహ్నం పూట పనిని కతర్ లో నిషేధించబడింది; ఉష్ణోగ్రతలు భరించలేని కారణంగా దీనితో అన్నికంపెనీలు ఉదయం11:30 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వచ్చే నెల ఆగస్టు చివరి వరకు ఇది కొనసాగుతుంది.ఉదయం 10 గంటల నుండి సూర్యాస్తమయం వరకు కార్మికులు వేసవి ఉష్ణోగ్రతలు భరించలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరియు వెలుపల పని చేసే కార్మికులు కోసం ఆయా సంస్థలు పని సులభంగా జరిగేందుకు రాత్రి 2:30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అలాగె మరొక పనివేళ సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పని మార్పులను ప్రవేశపెట్టాయిసూర్యుడు అస్తమించిన తర్వాత వాతావరణ పరిస్థితులు భరించదగిన రీతిలోనే ఉంటాయి కనుక పలువురు కార్మికులు సాయంత్రం షిఫ్ట్ ని ఇష్టపడతారు. కొత్త షెడ్యూల్ అమలులో లేకపోతే దేశంలో వివిధ పనులకు వడగాలి తీవ్ర విఘాతం కల్గించేదని ప్రస్తుతం పనివేళల మార్పు ఫలితంగా నిర్మాణ సంస్థల పని ఎంతో మెరుగుపడిందని ఒక ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సూపర్వైజర్ తెలిపారు..
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









