ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు నాయుడు..
- July 15, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో బాబు పాల్గొననున్నారు. రాష్ట్రపతిభవన్లోని వెస్ట్హాల్లో ఈ సమావేశం జరుగనుంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం నాలుగు అంశాలనే అజెండాలో చేర్చారు. ఫూంచి కమిషన్ సిఫార్సుల ఆమోదం, ఆధార్కార్డుపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. దీంతో పాటు నగదు బదిలీ పథకం, విద్యా ప్రమాణాలు పెంచడం అంతర్గత భద్రత అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది. 31మంది కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతిభవన్కు చేరుకున్నారు
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







