విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్..
- July 29, 2025
అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది.ఈ లక్ష్యంతో విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ‘పార్ట్నర్షిప్ సమ్మిట్’ నిర్వహించనుంది.దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సమ్మిట్కు ఆరుగురు మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మంత్రివర్గంలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీలో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉండనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వేదిక ఏర్పాట్లు, వసతులు, పర్యాటక మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







