విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్..
- July 29, 2025
అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది.ఈ లక్ష్యంతో విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ‘పార్ట్నర్షిప్ సమ్మిట్’ నిర్వహించనుంది.దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సమ్మిట్కు ఆరుగురు మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మంత్రివర్గంలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీలో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉండనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వేదిక ఏర్పాట్లు, వసతులు, పర్యాటక మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







