సౌదీ అరేబియా, పాలస్తీనా మధ్య మూడు కీలక అవగాహన ఒప్పందాలు..!!
- July 30, 2025
న్యూయార్క్ః సౌదీ అరేబియా, పాలస్తీనాలు మూడు కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, పాలస్తీనా ప్రధాన మంత్రి డాక్టర్ మొహమ్మద్ ముస్తఫా ఒప్పందాలపై సంతకాలు చేశారు. పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం, టూ-స్టేట్స్ పరిష్కారం అంశంపై న్యూయార్క్ లో జరిగిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి మొదటి ఒప్పందంపై సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పాలస్తీనా జనరల్ పర్సనల్ కౌన్సిల్ సంతకం చేశారు. విద్యా సంస్కరణలలో సౌదీ అరేబియా అనుభవాన్ని ఉపయోగించుకోవడం, పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న రెండవ ఒప్పందంపై సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ - పాలస్తీనా విద్య ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సంతకం చేశాయి.
డిజిటల్, ICT సహకారంపై దృష్టి సారించిన మూడవ ఒప్పందం సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ -పాలస్తీనా కమ్యూనికేషన్స్, డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ మధ్య సంతకం చేశాయి. ఈ ఒప్పందాలు సౌదీ -పాలస్తీనా మధ్య లోతైన సోదర సంబంధాలను ప్రతిబింబిస్తాయన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







