సౌదీ అరేబియా, పాలస్తీనా మధ్య మూడు కీలక అవగాహన ఒప్పందాలు..!!
- July 30, 2025
న్యూయార్క్ః సౌదీ అరేబియా, పాలస్తీనాలు మూడు కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, పాలస్తీనా ప్రధాన మంత్రి డాక్టర్ మొహమ్మద్ ముస్తఫా ఒప్పందాలపై సంతకాలు చేశారు. పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం, టూ-స్టేట్స్ పరిష్కారం అంశంపై న్యూయార్క్ లో జరిగిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి మొదటి ఒప్పందంపై సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పాలస్తీనా జనరల్ పర్సనల్ కౌన్సిల్ సంతకం చేశారు. విద్యా సంస్కరణలలో సౌదీ అరేబియా అనుభవాన్ని ఉపయోగించుకోవడం, పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న రెండవ ఒప్పందంపై సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ - పాలస్తీనా విద్య ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సంతకం చేశాయి.
డిజిటల్, ICT సహకారంపై దృష్టి సారించిన మూడవ ఒప్పందం సౌదీ అరేబియా కమ్యూనికేషన్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ -పాలస్తీనా కమ్యూనికేషన్స్, డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ మధ్య సంతకం చేశాయి. ఈ ఒప్పందాలు సౌదీ -పాలస్తీనా మధ్య లోతైన సోదర సంబంధాలను ప్రతిబింబిస్తాయన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







