మంగోలియాలో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి

- July 16, 2016 , by Maagulf
మంగోలియాలో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మంగోలియాలోని పెతబ్‌ ఆశ్రమంలో మహాత్మాగాంధీ రాతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతదేశం-మంగోలియాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలకు ప్రతీకైన మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో శనివారం జాతిపిత విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం అన్సారీ భారత మాజీ రాయబారి కుషోన్‌ బకులా రింపోచే స్థాపించిన ఆశ్రమాన్ని సందర్శించారు.
1999లో రింపోచే స్థాపించిన పెతబ్‌ ఆశ్రమాన్ని అప్పటి భారత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ ప్రారంభించారు. టిబెటన్‌ భాషలో పెతబ్‌ అంటే 'శ్రేష్ఠమైన' అని అర్థం. బౌద్ధ మతాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందనే భావనతోనే రింపోచే ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు.
గత ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి మఠాధిపతికి బోధి వృక్షం తాలూకు చిన్న మొక్కను బహూకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com