టర్కీలో తిరుగుబాటు నేపథ్యంలో 2700మంది జడ్జీల తొలగింపు
- July 16, 2016
టర్కీలో సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2,700మందికి పైగా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. దేశ జ్యుడిషయల్ బోర్డు అయిన జడ్జీలు, ప్రాసిక్యూటర్ల హైకౌన్సిల్ నిర్ణయం మేరకు న్యాయమూర్తులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కౌన్సిల్లోని ఐదుగురు సభ్యులను కూడా తీసేసినట్లు సమాచారం. అయితే వీరిని ఎందుకు తొలగించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
టర్కీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు, సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో 160 మంది మృతిచెందగా.. వేలమంది గాయపడ్డారు. తిరుగుబాటు నేపథ్యంలో 3వేల మందికి పైగా సైనికులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







