నెఫ్రాలజీ దక్షిణ భారత సంఘం 44వ వార్షిక సదస్సు విజయవంతంగా ముగిసింది
- August 03, 2025
విజయవాడ: ఆగస్టు 1 నుంచి 3, 2025 వరకు విజయవాడలో జరిగిన దక్షిణ భారత నెఫ్రాలజీ సంఘం (SCISN) 44వ వార్షిక సదస్సు ఘనంగా ముగిసింది.ఈ సదస్సు ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ సంఘం అధ్యక్షులు డా.అమ్మన్న,డా.శివరామకృష్ణ నేతృత్వంలో అత్యుత్తమంగా నిర్వహించబడింది.
సదస్సు ప్రారంభోత్సవాన్ని డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా. చంద్రశేఖర్ ప్రారంభించారు.దేశ విదేశాల నుండి 600 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో 300కి పైగా శాస్త్రీయ వ్యాసాలు సమర్పించబడ్డాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ మార్పిడి, నూతన ఔషధాలు, సాంకేతిక పరిజ్ఞాన పురోగతులు వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరగాయి.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన డా.స్వామినాథన్ గారు జెనో ట్రాన్స్ప్లాంటేషన్ భవిష్యత్తు, వైద్య పరిశోధనల్లో జరుగుతున్న ప్రగతిపై విశేష ప్రసంగం ఇచ్చారు.
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగాధిపతి డా.మంజుషా రైతుల్లో పరాక్వాట్ అనే విషపదార్థం వాడకంతో కలుగుతున్న విషపానం, ఆత్మహత్యలు మరియు మరణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలని, SCISN ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు మరియు విజయవాడ నుండి వచ్చిన నెఫ్రాలజిస్టులు ఈ సదస్సు విజయవంతమైన నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు.
సదస్సులో పాల్గొన్న ప్రతినిధుల కోసం కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు.సుమారు 350 మంది శీఘ్ర దర్శనం పొందగా, ఆలయ అధికారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సదస్సులో పాల్గొన్న ప్రముఖ నెఫ్రాలజిస్టులు:
-
డా.గురుదేవ్ (SCISN అధ్యక్షులు)
-
డా.శ్రీభూషణ్ రాజు (SCISN కార్యదర్శి)
-
డా.శివకుమార్
-
డా.రవిరాజు
-
డా.అనురాధ
-
డా.గిరీష్ నారాయణ్ తదితరులు.
ఈ సదస్సు శాస్త్రీయ విజ్ఞానానికి వేదికగా, ఆరోగ్య విధానాలపై చర్చలకు మరియు సాంస్కృతిక పరస్పర సంబంధాలకు ప్రతిరూపంగా నిలిచి విజయవంతంగా ముగిసింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









