బిగ్ అలెర్ట్.. సీఐఎస్ఎఫ్ భారీ రిక్రూట్మెంట్.. 70 వేల పోస్టుల భర్తీకి ప్లాన్
- August 05, 2025
చదువైపోయి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారా. అయితే, ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) త్వరలోనే భారీ నియామక ప్రకటన చేయనుంది. ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1.62 లక్షల సిబ్బంది ఉండగా దానిని 2.20 లక్షలకు పెంచేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే కొత్తగా 70,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలోనే ఈ పోస్టులను కేంద్రం భర్తీ చేయనుంది.
ఈ ప్రక్రియలో భాగంగా ఏటా సగటున 14,000 మంది సిబ్బందిని నియమించాలని సీఐఎస్ఎఫ్ భావిస్తోంది. ఇక ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో నక్సలిజం తగ్గుముఖం పట్టడంతో కొత్త పారిశ్రామిక కేంద్రాలు వాస్తాయని భావిస్తున్నారు. 2024లో సీఐఎస్ఎఫ్ 13,230 మందిని రిక్రూట్ చేయగా 2025 సంవత్సరానికి అది 24,098 కి పెరిగింది. వీటిలో మహిళల భాగస్వామ్యయం కూడా పెరుగుతుంది. ఈ కొత్తగా నియామకాలు జరిగిన వారిని జమ్ముకశ్మీర్ లోని విమానయానం, సముద్ర ఓడరేవులు, అణు స్థావరాలు, థర్మల్ పవర్ ప్లాంట్లు, జలవిద్యుత్ కేంద్రాలు, జైళ్లు వంటి కీలక రంగాల్లో మోహరించనున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష







