ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి
- August 09, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పండగ సంతోషాలను చెరిపేసేలా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రావణ మాసపు పండుగ ఉత్సాహం నడుమ, ఢిల్లీలోని హరినగర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను విషాదంలో ముంచేసింది. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో, హరినగర్లోని పాత ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక భారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ గోడ కూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
అయితే హాస్పిటల్లో చికిత్స పొందరు వారు మరణించినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇక్కడ ఒక పాత ఆలయం ఉంది, దాని పక్కనే స్క్రాప్ డీలర్లు నివసించే పాత జగ్గీలు ఉన్నాయి.రాత్రిపూట కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయి ఈ ప్రమాదం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. స్థానికంగా ఉన్న జగ్గీలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఐశ్వర్య శర్మ తెలిపారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









