గాజా వాసులకు నిత్యవసరాలు.. కువైట్ ఎయిర్ బ్రిడ్జి..!!
- August 10, 2025
కువైట్: గాజాకు అత్యవసర మానవతా సహాయం అందించడానికి కువైట్ ఎయిర్ బ్రిడ్జిలో భాగంగా తొలి విమానం ఆదివారం అబ్దుల్లా అల్-ముబారక్ ఎయిర్ బేస్ నుండి ఈజిప్ట్లోని అల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరుతుందని కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) ప్రకటించింది. పాలస్తీనియన్లకు అవసరమైన సహాయ సామాగ్రిని ఈ విమానం తీసుకువెళుతుందని KRCS చైర్మన్ ఖలీద్ అల్-ముఘామిస్ తెలిపారు. ఈ మిషన్ ఈజిప్షియన్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీలతో పాటు కువైట్ సామాజిక వ్యవహారాలు, రక్షణ విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో జరుగుతుందని తెలిపారు.
మరోవైపు గాజా వాసుల కోసం KD 11.5 మిలియన్ల విరాళాలను సేకరించినట్లు కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా వాసుల కోసం ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







