గాజా వాసులకు నిత్యవసరాలు.. కువైట్ ఎయిర్ బ్రిడ్జి..!!
- August 10, 2025
కువైట్: గాజాకు అత్యవసర మానవతా సహాయం అందించడానికి కువైట్ ఎయిర్ బ్రిడ్జిలో భాగంగా తొలి విమానం ఆదివారం అబ్దుల్లా అల్-ముబారక్ ఎయిర్ బేస్ నుండి ఈజిప్ట్లోని అల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరుతుందని కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS) ప్రకటించింది. పాలస్తీనియన్లకు అవసరమైన సహాయ సామాగ్రిని ఈ విమానం తీసుకువెళుతుందని KRCS చైర్మన్ ఖలీద్ అల్-ముఘామిస్ తెలిపారు. ఈ మిషన్ ఈజిప్షియన్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీలతో పాటు కువైట్ సామాజిక వ్యవహారాలు, రక్షణ విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో జరుగుతుందని తెలిపారు.
మరోవైపు గాజా వాసుల కోసం KD 11.5 మిలియన్ల విరాళాలను సేకరించినట్లు కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజా వాసుల కోసం ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









