ఒమన్ ప్రధాన రహదారులపై స్మార్ట్ కెమెరాల నిఘా..!!
- August 10, 2025
మస్కట్: ఒమన్ ప్రధాన రహదారులు స్మార్ట్ కెమెరాల పరిధిలో చేరాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మరియు ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణకు రాయల్ ఒమన్ పోలీసులు ఇటీవల స్మార్ట్ ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రమాదాలను తగ్గించడంతోపాటు స్మార్ట్ వాహనాల ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ పై పర్యవేక్షణ పెరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ అలీ బిన్ సలీమ్ అల్ ఫలాహి తెలిపారు.
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ తో ట్రాఫిక్ సిగ్నల్లను అనుసంధానించేందుకు వీలుగా అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల గురించి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్లో స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







