ఒమన్ ప్రధాన రహదారులపై స్మార్ట్ కెమెరాల నిఘా..!!
- August 10, 2025
మస్కట్: ఒమన్ ప్రధాన రహదారులు స్మార్ట్ కెమెరాల పరిధిలో చేరాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మరియు ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణకు రాయల్ ఒమన్ పోలీసులు ఇటీవల స్మార్ట్ ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రమాదాలను తగ్గించడంతోపాటు స్మార్ట్ వాహనాల ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ పై పర్యవేక్షణ పెరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ అలీ బిన్ సలీమ్ అల్ ఫలాహి తెలిపారు.
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ తో ట్రాఫిక్ సిగ్నల్లను అనుసంధానించేందుకు వీలుగా అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల గురించి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్లో స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









