ఒమన్ ప్రధాన రహదారులపై స్మార్ట్ కెమెరాల నిఘా..!!
- August 10, 2025
మస్కట్: ఒమన్ ప్రధాన రహదారులు స్మార్ట్ కెమెరాల పరిధిలో చేరాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మరియు ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణకు రాయల్ ఒమన్ పోలీసులు ఇటీవల స్మార్ట్ ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రమాదాలను తగ్గించడంతోపాటు స్మార్ట్ వాహనాల ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ పై పర్యవేక్షణ పెరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ అలీ బిన్ సలీమ్ అల్ ఫలాహి తెలిపారు.
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ తో ట్రాఫిక్ సిగ్నల్లను అనుసంధానించేందుకు వీలుగా అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల గురించి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్లో స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









