ఒమన్ ప్రధాన రహదారులపై స్మార్ట్ కెమెరాల నిఘా..!!
- August 10, 2025
మస్కట్: ఒమన్ ప్రధాన రహదారులు స్మార్ట్ కెమెరాల పరిధిలో చేరాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మరియు ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణకు రాయల్ ఒమన్ పోలీసులు ఇటీవల స్మార్ట్ ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రమాదాలను తగ్గించడంతోపాటు స్మార్ట్ వాహనాల ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ పై పర్యవేక్షణ పెరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ అలీ బిన్ సలీమ్ అల్ ఫలాహి తెలిపారు.
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ తో ట్రాఫిక్ సిగ్నల్లను అనుసంధానించేందుకు వీలుగా అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల గురించి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్లో స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!







