అబుదాబిలో విషాదం.. తెలంగాణకు చెందిన ప్రవాస దంపతులు మృతి..!!
- August 10, 2025
యూఏఈ: యూఏఈ రాజధాని అబుధాబిలో విషాదకర సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించగా, వారి ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం తెల్లవారుజామున అల్ ధన్నా నగరంలో కారు ప్రమాదం జరిగిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఈ జంట అబుదాబి నుండి కారులో వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల నుండి పదకొండు సంవత్సరాల మధ్య వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందన్నారు.
ఇక మృతులను సయ్యద్ వహీద్, సనా బీఘుమ్ గా గుర్తించినట్లు తెలిపారు. సయ్యద్ వహీద్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, అతను 2018 నుండి యూఏఈలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వారి మృతదేహాలను భారత్ కు పంపినట్లు తెలిపారు. వారి అంత్యక్రియలు భారత్ లో ముగిసినట్లు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







