అబుదాబిలో విషాదం.. తెలంగాణకు చెందిన ప్రవాస దంపతులు మృతి..!!
- August 10, 2025
యూఏఈ: యూఏఈ రాజధాని అబుధాబిలో విషాదకర సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించగా, వారి ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం తెల్లవారుజామున అల్ ధన్నా నగరంలో కారు ప్రమాదం జరిగిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఈ జంట అబుదాబి నుండి కారులో వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల నుండి పదకొండు సంవత్సరాల మధ్య వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందన్నారు.
ఇక మృతులను సయ్యద్ వహీద్, సనా బీఘుమ్ గా గుర్తించినట్లు తెలిపారు. సయ్యద్ వహీద్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, అతను 2018 నుండి యూఏఈలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వారి మృతదేహాలను భారత్ కు పంపినట్లు తెలిపారు. వారి అంత్యక్రియలు భారత్ లో ముగిసినట్లు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!









