అబుదాబిలో విషాదం.. తెలంగాణకు చెందిన ప్రవాస దంపతులు మృతి..!!
- August 10, 2025
యూఏఈ: యూఏఈ రాజధాని అబుధాబిలో విషాదకర సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించగా, వారి ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం తెల్లవారుజామున అల్ ధన్నా నగరంలో కారు ప్రమాదం జరిగిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఈ జంట అబుదాబి నుండి కారులో వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల నుండి పదకొండు సంవత్సరాల మధ్య వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందన్నారు.
ఇక మృతులను సయ్యద్ వహీద్, సనా బీఘుమ్ గా గుర్తించినట్లు తెలిపారు. సయ్యద్ వహీద్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, అతను 2018 నుండి యూఏఈలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వారి మృతదేహాలను భారత్ కు పంపినట్లు తెలిపారు. వారి అంత్యక్రియలు భారత్ లో ముగిసినట్లు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి