యూఏఈలో 17.6 మిలియన్ల ఇల్లీగల్ గూడ్స్ సీజ్..!!
- August 11, 2025
యూఏఈ: యూఏఈలో భారీగా ఇల్లీగల్ గూడ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ సహా 17.6 మిలియన్లకు పైగా నాన్-కాంప్లైంట్ ఎక్సైజ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ టాక్స్ అథారిటీ వెల్లడించింది.
కాగా, జనవరి మరియు జూన్ మధ్య 85,500 తనిఖీలను నిర్వహించినట్లు తెలిపింది. ఇక తనిఖీల సందర్భంగా Dh357.22 మిలియన్ల పన్నులు, జరిమానాలను వసూలు చేసినట్లు పేర్కొంది. ఇక అధికారులు సీజ్ చేసిన వస్తువులలో స్టాంపింగ్ లేని 11.52 మిలియన్ పొగాకు ప్యాక్లు, గుర్తింపు లేని 6.1 మిలియన్ బాటిళ్లు ఉన్నాయని తెలిపింది. వినియోగదారుల రక్షణకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని FTAలో ట్యాక్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా అల్ హబ్షి తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







