యూఏఈలో 17.6 మిలియన్ల ఇల్లీగల్ గూడ్స్ సీజ్..!!
- August 11, 2025
యూఏఈ: యూఏఈలో భారీగా ఇల్లీగల్ గూడ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ సహా 17.6 మిలియన్లకు పైగా నాన్-కాంప్లైంట్ ఎక్సైజ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ టాక్స్ అథారిటీ వెల్లడించింది.
కాగా, జనవరి మరియు జూన్ మధ్య 85,500 తనిఖీలను నిర్వహించినట్లు తెలిపింది. ఇక తనిఖీల సందర్భంగా Dh357.22 మిలియన్ల పన్నులు, జరిమానాలను వసూలు చేసినట్లు పేర్కొంది. ఇక అధికారులు సీజ్ చేసిన వస్తువులలో స్టాంపింగ్ లేని 11.52 మిలియన్ పొగాకు ప్యాక్లు, గుర్తింపు లేని 6.1 మిలియన్ బాటిళ్లు ఉన్నాయని తెలిపింది. వినియోగదారుల రక్షణకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని FTAలో ట్యాక్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా అల్ హబ్షి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







