యూఏఈలో 17.6 మిలియన్ల ఇల్లీగల్ గూడ్స్ సీజ్..!!
- August 11, 2025
యూఏఈ: యూఏఈలో భారీగా ఇల్లీగల్ గూడ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ సహా 17.6 మిలియన్లకు పైగా నాన్-కాంప్లైంట్ ఎక్సైజ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ టాక్స్ అథారిటీ వెల్లడించింది.
కాగా, జనవరి మరియు జూన్ మధ్య 85,500 తనిఖీలను నిర్వహించినట్లు తెలిపింది. ఇక తనిఖీల సందర్భంగా Dh357.22 మిలియన్ల పన్నులు, జరిమానాలను వసూలు చేసినట్లు పేర్కొంది. ఇక అధికారులు సీజ్ చేసిన వస్తువులలో స్టాంపింగ్ లేని 11.52 మిలియన్ పొగాకు ప్యాక్లు, గుర్తింపు లేని 6.1 మిలియన్ బాటిళ్లు ఉన్నాయని తెలిపింది. వినియోగదారుల రక్షణకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని FTAలో ట్యాక్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా అల్ హబ్షి తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







