అనుమతి లేకుండా పర్సనల్ కంటెంట్ షేరింగ్ నేరం.. 5ఏళ్ల జైలుశిక్ష..!!
- August 14, 2025
మనామా: ప్రజల గోప్యతను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పర్సనల్ కంటెంట్ కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ మేరకు అమన్ కార్యక్రమం కింద ఒక అవగాహన వీడియో ను విడుదల చేసింది.
చట్టంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చిత్రీకరించడం, రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం నేరమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే అనుచిత పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను లేదా ప్రమాద బాధితులను ప్రమాద స్థలాలలో ఫోటో తీయడం వంటివి చేసిన, అనుమతి లేకుండా అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇందుకుగాను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఇతరుల గోప్యతను గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







