అనుమతి లేకుండా పర్సనల్ కంటెంట్ షేరింగ్ నేరం.. 5ఏళ్ల జైలుశిక్ష..!!
- August 14, 2025
మనామా: ప్రజల గోప్యతను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పర్సనల్ కంటెంట్ కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ మేరకు అమన్ కార్యక్రమం కింద ఒక అవగాహన వీడియో ను విడుదల చేసింది.
చట్టంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చిత్రీకరించడం, రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం నేరమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే అనుచిత పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను లేదా ప్రమాద బాధితులను ప్రమాద స్థలాలలో ఫోటో తీయడం వంటివి చేసిన, అనుమతి లేకుండా అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇందుకుగాను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఇతరుల గోప్యతను గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









