అనుమతి లేకుండా పర్సనల్ కంటెంట్ షేరింగ్ నేరం.. 5ఏళ్ల జైలుశిక్ష..!!
- August 14, 2025
మనామా: ప్రజల గోప్యతను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పర్సనల్ కంటెంట్ కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ మేరకు అమన్ కార్యక్రమం కింద ఒక అవగాహన వీడియో ను విడుదల చేసింది.
చట్టంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చిత్రీకరించడం, రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం నేరమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే అనుచిత పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను లేదా ప్రమాద బాధితులను ప్రమాద స్థలాలలో ఫోటో తీయడం వంటివి చేసిన, అనుమతి లేకుండా అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇందుకుగాను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఇతరుల గోప్యతను గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







