అనుమతి లేకుండా పర్సనల్ కంటెంట్ షేరింగ్ నేరం.. 5ఏళ్ల జైలుశిక్ష..!!
- August 14, 2025
మనామా: ప్రజల గోప్యతను కాపాడేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పర్సనల్ కంటెంట్ కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన నేరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ మేరకు అమన్ కార్యక్రమం కింద ఒక అవగాహన వీడియో ను విడుదల చేసింది.
చట్టంలోని ఆర్టికల్ 370 ప్రకారం ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చిత్రీకరించడం, రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం నేరమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే అనుచిత పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను లేదా ప్రమాద బాధితులను ప్రమాద స్థలాలలో ఫోటో తీయడం వంటివి చేసిన, అనుమతి లేకుండా అలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇందుకుగాను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 బహ్రెయిన్ దినార్ల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఇతరుల గోప్యతను గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









