పేద వైద్య విద్యార్థినికి జయలలిత ఆర్థిక సాయం
- July 17, 2016
తిరుచ్చి జిల్లాకు చెందిన ఓ నిరుపేద వైద్య విద్యార్థిని చదువుకు ముఖ్యమంత్రి జయలలిత ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుచ్చి జిల్లా మేలకుళుమణి గ్రామానికి చెందిన ముత్తువీరన్, మలర్కొడి దంపతుల కుమార్తె బృందాదేవికి తిరువారూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి తనను చదివించడం అసాధ్యమని, అందువల్ల తన చదువుకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు బృందాదేవి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన జయలలిత ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతో పాటు తొలి ఏడాది విద్యా ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాల ఫీజు నిమిత్తతం రూ.50 వేలు నగదును 'పురట్చి తలైవి అమ్మ బెస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా అందించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







