అవయవ దానంలో కువైట్ రికార్డులు..!!
- August 16, 2025
కువైట్: అవయవ దానంలో కువైట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. 2024లో రికార్డు స్థాయిలో 149 కిడ్నీ మార్పిడిలను నిర్వహించినట్లు కువైట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ తుర్కి అల్-ఒటైబి తెలిపారు. అవయవ దానం అనేది రోగులకు కొత్త జీవితాన్ని అందించే మానవతా చర్య అని ఆయన తెలిపారు.
ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, గుండె మరియు మూత్రపిండాల మార్పిడి సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం, కువైట్లో 15,000 మంది వ్యక్తులు అవయవ దాత కార్డులను కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మంది రోగులలో ఒకరు మాత్రమే అవసరమైన అవయవాన్ని అందుకుంటున్నారని, డిమాండ్ సరఫరాను మించిపోయిందన్నారు. ఎక్కువ మంది అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని డాక్టర్ అల్-ఒటైబి కోరారు. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడే గొప్ప మానవీయ బహుమతి అని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









