అవయవ దానంలో కువైట్ రికార్డులు..!!
- August 16, 2025
కువైట్: అవయవ దానంలో కువైట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. 2024లో రికార్డు స్థాయిలో 149 కిడ్నీ మార్పిడిలను నిర్వహించినట్లు కువైట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ తుర్కి అల్-ఒటైబి తెలిపారు. అవయవ దానం అనేది రోగులకు కొత్త జీవితాన్ని అందించే మానవతా చర్య అని ఆయన తెలిపారు.
ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, గుండె మరియు మూత్రపిండాల మార్పిడి సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం, కువైట్లో 15,000 మంది వ్యక్తులు అవయవ దాత కార్డులను కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మంది రోగులలో ఒకరు మాత్రమే అవసరమైన అవయవాన్ని అందుకుంటున్నారని, డిమాండ్ సరఫరాను మించిపోయిందన్నారు. ఎక్కువ మంది అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని డాక్టర్ అల్-ఒటైబి కోరారు. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడే గొప్ప మానవీయ బహుమతి అని అన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









