అజ్మాన్ లో ఇ-స్కూటర్ పై నిషేధంపై భిన్నాభిప్రాయాలు..!!
- August 16, 2025
యూఏఈ: అజ్మాన్లో ఇ-స్కూటర్ల వాడకాన్ని నిషేధించాలనే నిర్ణయం కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరికొంతమంది నివాసితులు ఈ చర్యను సమాజ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకునే అధికారులు నిషేధ నిర్ణయి తీసుకుని ఉంటారని MA ట్రాఫిక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఇంజినీర్ ముస్తఫా అల్దా అన్నారు.
కాగా, చాలా మంది ఈ బైకర్స్ ట్రాఫిక్ చట్టాలను పాటిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా ఉండే కొందరి చర్యల వలన తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వారి వల్లే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుందని అన్నారు.
తాజాగా అజ్మాన్ పోలీసులు అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రకటించారు. గత నెలలో ఇ-స్కూటర్లు, ద్విచక్ర వాహనాలను నడిపేవారు రోడ్డుపై నియమాలను పాటించాలని ఒక సలహా జారీ చేశారు. అనధికార ఎలక్ట్రిక్ సైకిళ్ళు, స్కూటర్లను ఉపయోగించవద్దని పోలీసులు హెచ్చరించారు.
2024 సంవత్సరంలో ఇ-స్కూటర్ల కారణంగా 254 ప్రమాదాలు నమోదయ్యాయి. ఆయా ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







