అజ్మాన్ లో ఇ-స్కూటర్ పై నిషేధంపై భిన్నాభిప్రాయాలు..!!
- August 16, 2025
యూఏఈ: అజ్మాన్లో ఇ-స్కూటర్ల వాడకాన్ని నిషేధించాలనే నిర్ణయం కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరికొంతమంది నివాసితులు ఈ చర్యను సమాజ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకునే అధికారులు నిషేధ నిర్ణయి తీసుకుని ఉంటారని MA ట్రాఫిక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఇంజినీర్ ముస్తఫా అల్దా అన్నారు.
కాగా, చాలా మంది ఈ బైకర్స్ ట్రాఫిక్ చట్టాలను పాటిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా ఉండే కొందరి చర్యల వలన తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వారి వల్లే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుందని అన్నారు.
తాజాగా అజ్మాన్ పోలీసులు అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రకటించారు. గత నెలలో ఇ-స్కూటర్లు, ద్విచక్ర వాహనాలను నడిపేవారు రోడ్డుపై నియమాలను పాటించాలని ఒక సలహా జారీ చేశారు. అనధికార ఎలక్ట్రిక్ సైకిళ్ళు, స్కూటర్లను ఉపయోగించవద్దని పోలీసులు హెచ్చరించారు.
2024 సంవత్సరంలో ఇ-స్కూటర్ల కారణంగా 254 ప్రమాదాలు నమోదయ్యాయి. ఆయా ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









