అజ్మాన్ లో ఇ-స్కూటర్ పై నిషేధంపై భిన్నాభిప్రాయాలు..!!
- August 16, 2025
యూఏఈ: అజ్మాన్లో ఇ-స్కూటర్ల వాడకాన్ని నిషేధించాలనే నిర్ణయం కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరికొంతమంది నివాసితులు ఈ చర్యను సమాజ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకునే అధికారులు నిషేధ నిర్ణయి తీసుకుని ఉంటారని MA ట్రాఫిక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఇంజినీర్ ముస్తఫా అల్దా అన్నారు.
కాగా, చాలా మంది ఈ బైకర్స్ ట్రాఫిక్ చట్టాలను పాటిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా ఉండే కొందరి చర్యల వలన తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వారి వల్లే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుందని అన్నారు.
తాజాగా అజ్మాన్ పోలీసులు అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రకటించారు. గత నెలలో ఇ-స్కూటర్లు, ద్విచక్ర వాహనాలను నడిపేవారు రోడ్డుపై నియమాలను పాటించాలని ఒక సలహా జారీ చేశారు. అనధికార ఎలక్ట్రిక్ సైకిళ్ళు, స్కూటర్లను ఉపయోగించవద్దని పోలీసులు హెచ్చరించారు.
2024 సంవత్సరంలో ఇ-స్కూటర్ల కారణంగా 254 ప్రమాదాలు నమోదయ్యాయి. ఆయా ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









