షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..మాజీ ఉద్యోగే సూత్రధారి..!!
- August 17, 2025
యూఏఈః ఇండియాలోని కేరళకు వెకేషన్ కోసం వెళ్లిన షార్జాకు చెందిన బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తన కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగే దీనికి సూత్రధారి అని కేరళ పోలీసులు వెల్లడించారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఈ దురాగతానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ క్రమంలోనే షార్జా ఆధారిత ఫార్మసీ చైన్ ను నిర్వహించే వ్యాపారవేత్త కేరళలోని తన స్వస్థలమైన మాలాపురం మలేపురంకు సెలవుల కోసం వచ్చినప్పుడు కిడ్నాప్ కు ప్లాన్ చేసాడని తెలిపారు. కాగా, రెండు రోజుల తరువాత పోలీసులు అతడిని కొల్లం నుండి కిడ్నాప్ ముఠా నుంచి సురక్షితంగా రక్షించారు. కాగా, ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కేరళ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









