అల్ క్కుసైస్ ఫ్లాట్ లో భారత మహిళ ఆత్మహత్య
- July 17, 2016
దుబాయ్ లో ఒక భారతీయ మహిళ ఆదివారం ఆమె నివసిస్తున్న ఆపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కనుగొనబడింది. దుబాయ్ పోలీస్ కార్యకలాపాల గదికి లో అల్ క్కుసైస్ ఒక నివాస భవనం లో ఒక మహిళ ఉరి వేసుకొని చనిపోయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీనితో పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. అల్ మష్రాఫ్ భవనం ఫ్లాట్ నెంబర్ 302 లో నివసిస్తున్నఓ స్త్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ఆమె మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగంకు తరలించారు.
ఆత్మహత్యకు పాల్పడిన స్త్రీ తన భర్తతో గత మూడు సంవత్సరాలుగా ముగ్గురు పిల్లలతో ఇదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు, వారు సాధారణంగానే కనిపించేవారని ఇరుగుపొరుగు వారు తెలిపారు. పోలీసులు ఇప్పటికీ ఆమె మరణానికి కారణాలని పరిశోధిస్తున్నట్లు, ఆ స్త్రీ ఆత్మహత్య వెనుక ఎలాంటి నేర ఉద్దేశ్యం ఉన్నట్లుగా తాము భావించడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
భర్త ద్వారా సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వబడింది. ఆ భర్త తెలిపిన వివరాల ప్రకారం, తాము కుటుంబ సమేతంగా వేసవి ప్రయాణం చేయాలని అనుకుంటున్నామని, తనకు కొన్నిపనులు మిగిలి ఉండటంతో ఆ పనులు పూర్తి చేసేందుకు తాను ఆ రోజు బయటకు వెళ్లినట్లు తెలిపాడు.తాను పనులను ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన భార్య బాత్రూంలో ఉండగా తన ముగ్గురు పిల్లలు టీవీ చూస్తున్నారని, తన భార్య ఎంతసేపటికీ బాత్రూం నుంచి రాకపోవడంతో అనుమానం కల్గి బాత్రూం తలుపు మీద అనేక సార్లు తట్టి స్పందన లేకపోవడంతో ఆ తలుపును విరగకొట్టినట్లు తెలిపాడు. పడగొట్టాడు,లోపలకు తొంగి చూసిన ఆ భర్తకు పైకప్పు నుంచి కిందకు తాడుతో విగతజీవిగా వేలాడుతున్న తన భార్య కనబడిందని పోలీసులకు వివరించాడు. తన భార్యతో తనకు ఎటువంటి తగాదాలు లేవని తెలిపారు. అయితే, ఆమె వేసవి సెలవులలో ప్రయాణం చేయడం ఇష్టపడలేదు. కానీ ఆమె అందుకు తగినట్లుగా నిస్పృహతో కూడిన ఏ సూచనలు చేయలేదని ఆ భర్త వాపోయాడు. అక్కడకు వచ్చిన పిల్లలు తరువాత తమ తల్లి మరణం గురించి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







